తెలంగాణ సీఎం కేసీఆర్కు హైకోర్టు నోటీసులు
- June 23, 2022హైదరాబాద్: తెలంగాణలో అధికార పార్టీకి హైదరాబాద్లోని బంజారా హిల్స్లో భూమి కేటాయించిన వ్యవహారంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు టీఆర్ఎస్ అధినేత హోదాలో సీఎం కేసీఆర్కు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని దాదాపుగా అన్ని జిల్లాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు భూమి కేటాయింపును సవాల్ చేస్తూ రిటైర్డ్ ఉద్యోగి మహేశ్వరరాజు పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్లో హైదరాబాద్లోని టీఆర్ఎస్ కార్యాలయానికి భూమి కేటాయింపును కూడా పిటిషనర్ ప్రస్తావించారు. అత్యంత ఖరీదైన భూమిని గజం రూ.100 చొప్పున ఏకంగా 4,935 గజాలను టీఆర్ఎస్కు కేటాయించడాన్ని పిటిషనర్ ప్రశ్నించారు. దీనిపై గురువారం విచారణ చేపట్టిన హైకోర్టు కేసీఆర్తో పాటు పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, భూ పరిపాలన ప్రధాన కమిషనర్, హైదరాబాద్ జిల్లా కలెక్టర్లకు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆ నోటీసుల్లో ఆదేశించింది.
తాజా వార్తలు
- ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి పై ఈసీ బదిలీ వేటు
- వాట్సాప్ అకౌంట్ ‘రిస్ట్రిక్షన్’ ఫీచర్ వచ్చేస్తోంది..
- అబుదాబిలో ప్రధాని మోడీ గెలవాలని పూజలు
- కార్ మెకానిక్ పై దాడి.. కారు ఓనర్ కు 3ఏళ్ల జైలుశిక్ష
- షార్జా హడిబా క్షేత్రంలో కొత్త గ్యాస్ నిల్వలు
- కైరో వీధిలో కొత్త టన్నెల్ ప్రారంభం
- ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ఆరోగ్య మంత్రిత్వ శాఖ నివేదిక
- సముద్ర నౌకలను తనిఖీ చేసిన అధికారులు
- ఒమన్లో విస్తరిస్తున్న తుఫాన్..?
- మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల..