భార్య పై కోపంతో కుమారుడితో సహా భర్త ఆత్మహత్య
- June 24, 2022బహ్రెయిన్: భార్యపై కోపంతో కుమారుడిని చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న ఘటన ఇండియాలోని కేరళలో చోటు చేసుకుంది. మృతులను కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురం జిల్లాకు చెందిన ప్రకాష్ దేవరాజన్ (48), అతని కుమారుడు శివదేవ్గా గుర్తించారు. తన 11 ఏళ్ల కుమారుడిని కారులో తీసుకెళ్లిన ప్రకాశ్.. డీజిల్ ట్యాంకర్ లారీని ఢీకొట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు తమ మరణానికి తన భార్య, స్నేహితులే కారణమంటూ ప్రకాష్ తన సూసైడ్ నోట్ ను ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. ప్రకాష్ భార్య బహ్రెయిన్ లో ఉంటుంది. ఆమె ఇండియాకు తిరిగి రావాలని కోరుకున్నాడు. కానీ, ఆమె అతని మాట వినకపోవడంతో.. కుమారుడితో సహా తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ఈ మేరకు ప్రకాష్ రాసిన సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా ఉంది.ఈ ఘటనపై కేరళ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
తాజా వార్తలు
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!
- సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్లకు అడ్మిషన్లు ప్రారంభం
- షేక్ తహ్నౌన్ మరణంపై అమీర్ సంతాపం
- బీచ్లు, పబ్లిక్ పార్కులు, మార్కెట్లు మూసివేత
- కువైట్లో కోవిడ్-19 వ్యాక్సిన్ల దుష్ప్రభావాలు లేవు..!