నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు బంద్
- June 24, 2022
దోహా: ఖతార్లో నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించనున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు నవంబర్ 15 నుండి అన్ని రకాల ఉత్పత్తులు, వస్తువులను ప్యాకేజింగ్ చేయడం, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, మోసుకెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్లు, కాగితంతో చేసిన బ్యాగ్లు లేదా క్లాత్ బ్యాగులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్లతో తయారు చేసిన బ్యాగులను వాడాలని సూచించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని లీగల్ అఫైర్స్ డైరెక్టర్ అహ్మద్ యూసఫ్ అల్ ఇమాది, వేస్ట్ రీసైక్లింగ్ అండ్ ట్రీట్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎంగ్ హమద్ జాసిమ్ అల్ బహర్, అల్ వక్రా మునిసిపాలిటీ డైరెక్టర్ ఇంజి ముహమ్మద్ హసన్ అల్ నుయిమి, పలువురు మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







