నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు బంద్
- June 24, 2022
దోహా: ఖతార్లో నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించనున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు నవంబర్ 15 నుండి అన్ని రకాల ఉత్పత్తులు, వస్తువులను ప్యాకేజింగ్ చేయడం, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, మోసుకెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్లు, కాగితంతో చేసిన బ్యాగ్లు లేదా క్లాత్ బ్యాగులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్లతో తయారు చేసిన బ్యాగులను వాడాలని సూచించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని లీగల్ అఫైర్స్ డైరెక్టర్ అహ్మద్ యూసఫ్ అల్ ఇమాది, వేస్ట్ రీసైక్లింగ్ అండ్ ట్రీట్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎంగ్ హమద్ జాసిమ్ అల్ బహర్, అల్ వక్రా మునిసిపాలిటీ డైరెక్టర్ ఇంజి ముహమ్మద్ హసన్ అల్ నుయిమి, పలువురు మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- విజయవాడ వేదికగా తొలిసారిగా ‘స్టేట్ ఐకాన్స్ అవార్డ్స్–2026’
- యూఏఈలో మధ్యాహ్న వేళ డెలివరీ రైడర్ల రక్షణకు కొత్త నిబంధనలు అమల్లోకి
- కార్మిక రంగంలో సహకారంపై ఖతార్, సింగపూర్ సమీక్ష..!!
- ఎతిహాద్ రైల్ టికెట్ ధరలు: పిల్లలకు 50% తగ్గింపు, రద్దుపై రీఫండ్..!!
- ఒమన్ సుల్తాన్ ను ఆహ్వానించిన కింగ్ చార్లెస్..!!
- హౌతీలకు సౌదీ అరేబియా స్ట్రాంగ్ వార్నింగ్..!!
- డిజిటల్ కనెక్టివిటీలో ప్రపంచ అగ్రగామిగా బహ్రెయిన్..!!
- ప్లాస్టిక్ కాలుష్యం.. మానవాళికి పెనుశాపం..!!
- యూఏఈ వీసా నిబంధనల్లో 2026లో 6 కీలక మార్పులు..
- ఏపీలో విద్యార్థులకు ఆర్టీసీ బస్ పాస్లు ఉచితం







