నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగులు బంద్
- June 24, 2022
దోహా: ఖతార్లో నవంబర్ 15 నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగాన్ని నిషేధించనున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. సంస్థలు, కంపెనీలు, షాపింగ్ కేంద్రాలు నవంబర్ 15 నుండి అన్ని రకాల ఉత్పత్తులు, వస్తువులను ప్యాకేజింగ్ చేయడం, ప్రదర్శించడం, సర్క్యులేట్ చేయడం, మోసుకెళ్లడం లేదా రవాణా చేయడంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగించడాన్ని నిషేధిస్తున్నట్లు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ తెలిపింది. వీటి స్థానంలో బయోడిగ్రేడబుల్ బ్యాగ్లు, కాగితంతో చేసిన బ్యాగ్లు లేదా క్లాత్ బ్యాగులు, ఇతర బయోడిగ్రేడబుల్ మెటీరియల్లతో తయారు చేసిన బ్యాగులను వాడాలని సూచించింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల వినియోగంపై నిర్వహించిన కాన్ఫరెన్స్ లో మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని లీగల్ అఫైర్స్ డైరెక్టర్ అహ్మద్ యూసఫ్ అల్ ఇమాది, వేస్ట్ రీసైక్లింగ్ అండ్ ట్రీట్మెంట్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ ఎంగ్ హమద్ జాసిమ్ అల్ బహర్, అల్ వక్రా మునిసిపాలిటీ డైరెక్టర్ ఇంజి ముహమ్మద్ హసన్ అల్ నుయిమి, పలువురు మంత్రిత్వ శాఖ అధికారులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!