సెల్ ఫోన్ కంపెనీపై మంత్రిత్వ శాఖ దాడులు

- June 26, 2022 , by Maagulf
సెల్ ఫోన్ కంపెనీపై మంత్రిత్వ శాఖ దాడులు

కువైట్: ఫర్వానియాలోని ఒక సెల్ ఫోన్ కంపెనీపై వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఇన్‌స్పెక్టర్లు దాడి చేసి విస్తృత శ్రేణిలో ఉపయోగించిన గాడ్జెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. ముఖ్యంగా ఇదివరకే వాడిన సెల్ ఫోన్‌లను మరమ్మతులు చేసి.. కొత్తవిగా విక్రయించడానికి అసలు పెట్టెల్లో మళ్లీ ప్యాక్ చేసిన వాటిని బారీ ఎత్తున స్వాధీనం చేసుకున్నారు. మోసానికి పాల్పడినట్లు కంపెనీపై అభియోగాలు నమోదు చేసినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖ ఇన్‌స్పెక్టర్లు చాలా రోజుల పాటు వెరిఫికేషన్, ఫాలో-అప్ తర్వాత కంపెనీ ప్రధాన కార్యాలయంలో దాడులు చేసి పెద్ద మొత్తంలో పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసిన స్టోర్‌లను గుర్తించడానికి వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రస్తుతం కంపెనీ ఇన్‌వాయిస్‌లను పరిశీలిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com