గల్ఫ్ విమానయాన ఖర్చులు మీద చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపి సదాశివన్
- June 26, 2022
కేరళ: విపరీతంగా పెరిగిపోయిన గల్ఫ్ విమానయాన ప్రయాణ ఖర్చులు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ పార్లిమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళకు చెందిన సిపిఎం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ డి.వి.సదాశివన్ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు లేఖ రాశారు.
వేసవి కాలం మొదలయ్యే సమయానికి గల్ఫ్ దేశాలలో పాటుగా యూఏఈ కూడా విమానయాన ప్రయాణ ఖర్చులను భారీగా పెంచాయి.
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులలో భారతీయులు కూడా పనిచేస్తున్నారు.వేసవిలో వారికి సెలవులు కావడంతో తమ స్వదేశానికి రావడానికి ఇష్టపడతారు.గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల మీద విధించిన ఆంక్షలు నేపథ్యంలో వారు రాలేకపోయారు. కానీ ఇప్పుడు వద్దామంటే విమానయాన సంస్థలు పెంచిన ప్రయాణ ఖర్చులు కారణంగా చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.కాబట్టి ఈ విషయంలో మీరు చొరవ తీసుకుని సమస్యను పరిష్కారించాలని కేంద్ర మంత్రిని సదాశివన్ కోరారు.
తాజా వార్తలు
- దుబాయ్ ఫ్యామిలీ విజిట్ వీసా కోసం కనీస జీతం ఎంత ఉండాలి?
- ఇరాన్ పై అమెరికా వరుసగా 13వ రాత్రి వైమానిక దాడులు..
- బహ్రెయిన్లో అత్యవసర సైరన్లు మోగింపు..
- విద్యార్థుల తెలివితేటలను అవమానించొద్దు: మోదీ వీడియో సందేశం పై రాహుల్ ఫైర్
- ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ నాలుగో రోజూ విపక్షాల నిరసన
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!







