గల్ఫ్ విమానయాన ఖర్చులు మీద చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపి సదాశివన్

- June 26, 2022 , by Maagulf
గల్ఫ్ విమానయాన ఖర్చులు మీద చర్యలు తీసుకోవాలని కోరిన ఎంపి సదాశివన్

కేరళ: విపరీతంగా పెరిగిపోయిన గల్ఫ్ విమానయాన ప్రయాణ ఖర్చులు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇండియన్ పార్లిమెంట్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళకు చెందిన సిపిఎం రాజ్యసభ సభ్యుడు డాక్టర్ డి.వి.సదాశివన్ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియాకు లేఖ రాశారు. 

వేసవి కాలం మొదలయ్యే సమయానికి గల్ఫ్ దేశాలలో పాటుగా యూఏఈ కూడా విమానయాన ప్రయాణ ఖర్చులను భారీగా పెంచాయి. 

గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న విదేశీ కార్మికులలో  భారతీయులు కూడా పనిచేస్తున్నారు.వేసవిలో వారికి సెలవులు కావడంతో తమ స్వదేశానికి రావడానికి ఇష్టపడతారు.గత రెండేళ్లుగా కోవిడ్ ఆంక్షలు నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాల మీద విధించిన ఆంక్షలు నేపథ్యంలో వారు రాలేకపోయారు. కానీ ఇప్పుడు వద్దామంటే విమానయాన సంస్థలు పెంచిన ప్రయాణ ఖర్చులు కారణంగా చాలా మంది తమ ప్రయాణాలను వాయిదా వేసుకుంటున్నారు.కాబట్టి ఈ విషయంలో మీరు చొరవ తీసుకుని సమస్యను పరిష్కారించాలని కేంద్ర మంత్రిని సదాశివన్ కోరారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com