'పక్కా కమర్షియల్'.. టికెట్లు మాత్రం కమర్షియల్ కాదు..
- June 26, 2022
హైదరాబాద్: గోపీచంద్ అంటే యాక్షన్, మారుతీ అంటే హ్యూమర్ ఈ రెండు కలిస్తే రచ్చ రచ్చే.ఇప్పుడు పక్కా కమర్షియల్ సినిమాతో ఎంటర్ టైన్మెంట్ పక్కా అంటున్నారు గోపీచంద్, మారుతి. గత కొంత కాలంగా బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లతో నిరాశ చెందిన గోపీచంద్ కి సంపత్ నంది దర్శకత్వంలో ఇటీవల వచ్చిన సీటీమార్ కాస్త ఉపశమనం కలిగించింది.ఇప్పుడు మంచి కామెడి టైమింగ్ తో వరసగా సక్సెస్ లు కొడుతున్న మినిమం గ్యారెంటీ డైరెక్టర్ మారతితో, పక్కా యాక్షన్ హీరో గోపీచంద్ నటిస్తుండటంతో ఈ సినిమాపై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొంది.ఇప్పటికే రిలీజ్ అయిన ట్రయిలర్ అంచనాలను పెంచేస్తోంది.
జులై 1న విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా టికెట్ రేట్లు భారీగా తగ్గించి, ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయబోతుంది.గత కొద్దికాలంగా సినిమా బాగున్నా టికల్ట్ రేట్లు ఎక్కువుండటంతో కలెక్షన్స్ రావట్లేదు. ఈ విషయం నిర్మాతలకి అర్థమై ఇప్పుడిప్పుడే టికెట్ రేట్లని తగ్గిస్తున్నారు. ఇప్పుడు పక్కా కమర్షియల్ కూడా టికెట్ల ధరల విషయంలో మాత్రం కమర్షియల్ కాదంటుంది. తెలంగాణలో సింగిల్ థియేటర్లకు 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 160 రూపాయలు కాగా, ఏపిలో నార్మల్ థియేటర్లకు 100 రూపాయలు, మల్టీప్లెక్స్ లో 150 రూపాయలుగా ఉండబోతుందని ప్రకటించి ఇప్పటికే ప్రేక్షకులను థియేటర్స్ కి ఆకర్షిస్తుంది పక్కాకమర్షియల్ టీమ్. లక్ష్యం, లౌఖ్యం, జిల్ లాంటి సినిమాలతో యాక్షన్ తో పాటు కామెడి పండించిన గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమాలో మారుతి మార్క్ ఫన్ ని,యాక్షన్ హీరో గోపీచంద్ ఎలా చేసి ఉంటారో అనే చర్చ ఇప్పటికే ఫాన్స్ మధ్య నడుస్తోంది.
ప్రస్తుతం ప్రమోషన్ తో బిజీగా ఉంది టీం.ఈ ఆదివారం జరగనున్న పక్కాకమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వస్తుండటంతో ఈ సినిమాపైన మెగా అభిమానులూ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ సినిమాలో గోపీచంద్ సరసన జిల్, ఆక్సిజన్ తర్వాత మూడోసారి హీరోయిన్ గా నటిస్తుంది రాశిఖన్నా.మరి పక్కా కమర్షియల్ గోపీచంద్, మారుతికి రేంజ్ కమర్షియల్ హిట్ ఇస్తుందో చూడాలి.గల్ఫ్ లో ఈ సినిమా జులై 1న వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ ద్వారా విడుదల కానుంది.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







