సౌదీలో సెమిస్టర్ పరీక్షలు.. 5 మిలియన్ల స్టూడెంట్స్ హాజరు
- June 27, 2022
రియాద్: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 1443 AH సంవత్సరం మూడవ సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు దాదాపు 4,980,229 మంది విద్యార్థు హాజరవుతున్నారు. ఇవి వచ్చే బుధవారం వరకు కొనసాగనున్నాయి. విద్యా మంత్రిత్వ శాఖా అధికారులు పరీక్షల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాఠశాలల పాఠ్యాంశాలను సమీక్షించడానికి, వివిధ విభాగాలకు సమగ్ర మానసిక ప్రణాళికలను రూపొందించడానికి టైమ్టేబుల్ను తయారు చేయడంతో సహా, చివరి పరీక్షలకు బాగా సిద్ధం కావడానికి విద్యార్థులకు చిట్కాలు, సూచనలను "ట్విటర్"లో మంత్రిత్వ శాఖ అందుబాటులో పెట్టింది. తగినంత నిద్ర పోవాలని, ఒత్తిడికి గురికావద్దని, పాఠ్యాంశాలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ప్రతి పాఠానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను గుర్తించి రివిజన్ చేయాలని విద్యార్థులకు మంత్రిత్వ శాఖ సూచించింది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు