అంబానీ సంచలన నిర్ణయం
- June 28, 2022
ముంబై: ముకేశ్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రిలయన్స్ జియో ఛైర్మన్ పదవికి అంబానీ రాజీనామా చేసి , ఆ స్థానంలో ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ ఛైర్మన్గా నియమించారు. ఇకపై ఆకాశ్ అంబానీ జియో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కు ఛైర్మన్గా వ్యవహరించనున్నారు. ఇప్పటివరకు ఆ స్థానంలో ఉన్న ముకేశ్.. జూన్ 27న రాజీనామా చేశారని సంస్థ స్టాక్మార్కెట్లకు ఇచ్చిన ఫైలింగ్స్లో వెల్లడించింది. అదేరోజు జరిగిన సమావేశంలో ఆకాశ్ నియామకానికి బోర్డు ఆమోదముద్ర వేసిందని తెలిపింది.
ఆకాశ్.. ఇప్పటివరకు రిలయన్స్ జియోలో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. 2014లో జియో బోర్డులో చేరారు.అదేసమయంలో, జియో మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ను నియమిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది. జూన్ 27నే ఆయన ఈ బాధ్యతలు చేపట్టినట్లు తెలిపింది. రిలయన్స్ జియో లో కీలక మార్పులు చోటు చేసుకోవడం కార్పొరేటర్ సెక్టార్లో చర్చనీయాంశమైంది. ఏకంగా ముకేశ్ అంబానీ తప్పుకోవడం ఆసక్తి రేపుతోంది.
తాజా డైరెక్టర్ల బోర్డ్ తీసుకున్న వివరాలిలా ఉన్నాయి…
(ఎ) వాటాదారుల ఆమోదానికి లోబడి 27 జూన్ 2022 నుండి ప్రారంభమయ్యే ఐదు సంవత్సరాల కాలానికి ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా నియమితులైన రమీందర్ సింగ్ గుజ్రాల్, కేవీ చౌదరి నియామకాలకు ఆమోదం. (బి) వాటాదారుల ఆమోదానికి లోబడి… సోమవారం(27 జూన్) నుండి ప్రారంభమైన ఐదు సంవత్సరాల కాలానికి కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా పంకజ్ మోహన్ పవార్ నియామకానికి ఆమోదం. (సి) కంపెనీ డైరెక్టర్ల బోర్డు ఛైర్మన్గా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆకాష్ ఎం అంబానీ నియామకానికి ఆమోదం.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







