పలువురు బాలీవుడ్ తారలకు యూఏఈ గోల్డెన్ వీసా
- June 29, 2022
యూఏఈ: యూఏఈలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్కు అరుదైన గౌరవం దక్కింది. యూఏఈ విదేశీయులకు దీర్ఘకాలిక రెసిడెన్సీ కోసం ఇచ్చే గోల్డెన్ వీసా ప్రకటించింది. సల్లూభాయ్తో పాటు జెనీలియా, రితేష్ దేశ్ముఖ్ దంపతులు, దివ్య కుమార్, భూషణ్ కుమార్, అన్నీస్ బేజ్మీ, అండ్రే తిమ్మిన్స్కు కూడా యూఏఈ ప్రభుత్వం గోల్డెన్ వీసా మంజూరు చేసింది. ఈ నెలలో అబుదాబిలోని యాస్ ఐలాండ్ సగర్వంగా 2022 IIFA వీకెండ్ & అవార్డ్స్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ వేడుకకు భారతీయ చలనచిత్ర రంగానికి చెందిన పలువురు నటీనటులు అబుదాబికి వెళ్లారు. ఎతిహాద్ ఏరెనా నెక్సా ఐఐఎఫ్ఏ అవార్డ్స్కు సంబంధించిన 22వ ఎడిషన్కు ఆతిథ్యమిచ్చింది. ఇక ఈ వేదిక సినీ పరిశ్రమకు చెందిన సభ్యుల్లో కొంతమందికి గోల్డెన్ వీసా జారీ ప్రక్రియను సులభతరం చేసే విషయమై అబుదాబి ఫిల్మ్ కమిషన్తో కలిసి పనిచేసినందుకు IIFA సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. దీంతో అబుదాబి పరిశ్రమల సృజనాత్మక నిబద్ధతను ప్రతిబింబించేలా IIFA వారాంతంలోనే ఇలా పలువురు బాలీవుడ్ స్టార్స్కు గోల్డెన్ వీసాలు జారీ చేయబడ్డాయి.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







