నేటితో రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు ముగింపు
- June 29, 2022
న్యూఢిల్లీ : నేటితో రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో ఆ గడువు ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జులై 2 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 21న ఓట్లను లెక్కించనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది.
లోక్సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. పార్లమెంట్ హౌస్, రాష్ట్రాల శాసనసభల్లో రహస్య బ్యాలట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది. కాగా, ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే వీరిరువురు తమ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ఈ నెల 30 వరకు ఏపీ అసెంబ్లీ
- రాహుల్ గాంధీ మరో బాంబు..మీడియా ముందుకు ‘సాక్ష్యాలు’..
- మోడీ కి ఘనంగా విషెస్ తెలిపిన బుర్జ్ ఖలీఫా
- సామాన్యుడి సైతం అందుబాటులో విమాన ప్రయాణం: కేంద్ర మంత్రి రామ్మోహన్
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్ఫామ్..!!