నేటితో రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు ముగింపు
- June 29, 2022
న్యూఢిల్లీ : నేటితో రాష్ట్రపతి ఎన్నిక నామినేషన్ గడువు ముగియనుంది. భారత 16వ రాష్ట్రపతి ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల చేసింది. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయింది. నేటితో ఆ గడువు ముగియనుంది. రేపు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. జులై 2 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. జులై 18న రాష్ట్రపతి ఎన్నిక జరుగుతుంది. వచ్చే నెల 21న ఓట్లను లెక్కించనున్నారు. కొత్త రాష్ట్రపతి జులై 25న ప్రమాణస్వీకారం చేస్తారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జులై 24న ముగియనుంది.
లోక్సభ, రాజ్యసభ, శాసన సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా రాష్ట్రపతి ఎన్నికవుతారు. పార్లమెంట్ హౌస్, రాష్ట్రాల శాసనసభల్లో రహస్య బ్యాలట్ విధానంలో పోలింగ్ జరుగుతుంది. కాగా, ఎన్డీయే తరఫున ద్రౌపది ముర్ము, విపక్షాల తరఫున కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచారు. ఇప్పటికే వీరిరువురు తమ నామినేషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







