వీసా ఉల్లంఘనులు పెరగడంతో విజిట్ వీసా నిలిపివేత

- June 29, 2022 , by Maagulf
వీసా ఉల్లంఘనులు పెరగడంతో విజిట్ వీసా నిలిపివేత

కువైట్: టూరిస్ట్ మరియు ఫ్యామిలీ విజిట్ వీసాలను నిలిపివేయడానికి కారణాన్ని కువైట్ వెల్లడించింది. వీసా ఉల్లంఘనుల సంఖ్య పెరగడం వల్లే నిలిపివేత అమలు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. గత కొద్ది నెలలుగా దేశంలోకి వచ్చిన పలువురు, తిరిగి దేశం విడిచి వెళ్ళలేదని తెలుస్తోంది. సుమారు 20,000 మంది వీసా ఉల్లంఘనలు వున్నట్లు తెలుస్తోంది. 2022లో మొత్తంగా విజిట్ మరియు టూరిస్ట్ వీసాల ద్వారా వచ్చినవారి సంఖ్య 70,000గా వుంది. అయితే, ఎలక్ట్రానిక్ వీసాల విషయంలో నిలిపివేత లేదని అథారిటీస్ చెబుతున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com