ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా జాగ్రత్త ..

- April 11, 2016 , by Maagulf
ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా  జాగ్రత్త ..

డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు విన్నవించారు. ప్రగతి రిసార్ట్స్‌లో జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు శిక్షణా తరగతుల సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ప్రభుత్వంపై నమ్మకంతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల కోసం లక్షలాది దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కోసం స్థలాలు ఎక్కడ ఉన్నాయో గుర్తించాలన్నారు. ప్రభుత్వ పథకాలు దళారుల వల్ల పక్కదారి పట్టకుండా అధికారులు జాగ్రత్త తీసుకోవాలన్నారు. ప్రభుత్వ పథకాల్లో దళారుల వ్యవస్థను ప్రజలు, అధికారులు అంతం చేయాలని సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com