సీనియర్ నటుడు నరేష్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ: ఈ వివాదానికి ముగెంపు ఎప్పుడో.!
- July 04, 2022
సీనియర్ నటుడు నరేష్, పవిత్రా లోకేష్ మధ్య అఫైర్ ఇష్యూ తాజాగా టాలీవుడ్లో హాట్ టాపిక్ అయ్యింది.తనకు విడాకులివ్వకుండా, మరో మహిళతో కలిసి ఎలా వుంటాడు.. అంటూ నరేష్పై ఆయన మూడో భార్య రమ్య రఘుపతి పలు ఆరోపణలు చేస్తున్నారు.
ఈ ఇష్యూ ఇప్పుడు ఇంకాస్త ముదిరి పాకాన పడింది. బెంగుళూర్లోని మోసూర్ హోటల్లో పవిత్రా లోకేష్తో కలిసి వున్న నరేష్ను రమ్య రఘుపతి రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంది. వారిద్దరూ బస చేసిన ఆ హోటల్ రూమ్ వద్దే బైఠాయించి పెద్ద డ్రామానే ప్లే చేసింది. చివరికి పోలీసులు కలగచేసుకోవడంతో, బందోబస్తు మధ్య నరేష్, పవిత్రా లోకేష్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
ఆ సమయంలో రమ్య రఘుపతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు, చెప్పుతో నరేష్పై దాడికి దిగింది. ఈ క్రమంలో ఆమెని వారించే ప్రయత్నం చేసిన పోలీసుల మీద కూడా ఆమె దాడి చేసింది.
సహజంగానే ఇలాంటి ఇష్యూస్కి క్రేజ్ ఎక్కువ. అందులోనూ ఇంత క్రేజీయెస్ట్గా సాగుతోన్న ఈ రచ్చ డ్రామాకి కొన్ని ఛానెళ్లు, తమ టీఆర్పీ రేటింగులు పెంచుకునే క్రమంలో మరింత హంగామా చేస్తూ, హైప్ పెంచుతున్నారు.
కాగా, నరేష్ వెర్షన్ ఎలా వుందంటే, రమ్యతో తనకు ఎప్పుడో తెగతెంపులు అయిపోయాయనీ, పవిత్రా లోకేష్ తనకు మంచి స్నేహితురాలనీ, రమ్య తనను ఆర్ధికంగా, మానసికంగా క్షోభ పెట్టడంతో, తాను చాలా కుంగుబాటుకు లోనయ్యాననీ, ఆ టైమ్లో పవిత్రా లోకేష్ తనకు తోడుగా వుందనీ చెప్పుకొచ్చాడు.
అలాగే, పవిత్రా లోకేష్ కూడా, నరేష్ చాలా మంచి వ్యక్తి అనీ, తమ మధ్య వున్న రిలేషన్షిప్ని చాలా నీచంగా మాట్లాడుతూ, తనను బ్యాడ్ చేసేలా రమ్య వ్యాఖ్యలున్నాయనీ వాపోయింది పవిత్ర లోకేష్.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









