అనసూయ క్రేజ్కి బ్రేకుల్లేవుగా..! చెలరేగిపోతోంది.!
- July 04, 2022
బుల్లితెర హాటెస్ట్ యాంకర్గా అనసూయకు మంచి పేరుంది. ఆ పేరుతోనే ఇప్పుడు వెండితెరపైనా క్రేజీయెస్ట్ ఆర్టిస్టుగా మారిపోయింది. అనసూయ కోసం బుల్లితెరపై కొంగొత్త క్యారెక్టర్లు పుట్టుకొస్తున్నాయంటే అతిశయోక్తి కాదేమో.
వయసు మీద పడుతున్నా, ఐటెం సాంగ్స్ ఓ పక్క, అదిరిపోయే ఇంపార్టెంట్ రోల్స్ ఇంకో పక్క.. అనసూయ కెరీర్కి ఇప్పట్లో ఢోకానే లేదనాలేమో. దాంతో పాటు, తాజాగా ఓటీటీ తెర పైనా అనసూయ హల్చల్ మొదలైంది.
ఇప్పటికే మెగా డాటర్ నిహారికతో కలిసి అనసూయ ఓ వెబ్ సిరీస్లో నటిస్తోంది. అలాగే, మరో కొత్త వెబ్ సిరీస్కి అనసూయ ఎంపికైనట్లు తెలుస్తోంది. కన్యాశుల్కం నవల ఆధారంగా రూపొందుతోన్న ఈ వెబ్ సిరీస్కి డైరెక్టర్ క్రిష్ స్ర్కిప్ట్ అందిస్తున్నాడట. అలాగే, నిర్మాణంలోనూ క్రిష్ భాగస్వామ్యం వహిస్తున్నాడట.
ఈ సిరీస్లోని ఓ ఇంపార్టెంట్ రోల్ కోసం అనసూయను సజెస్ట్ చేశాడట క్రిష్ జాగర్లమూడి. అది ఓ వేశ్య పాత్రనీ తెలుస్తోంది. త్వరలోనే ఈ సిరీస్ ప్రారంభం కానుందట. సౌత్లోని అన్ని భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ స్ర్టీమింగ్ కానుందట. అనసూయకి సంబంధించి ఇదో తాజా హాటెస్ట్ అప్డేట్గా చెప్పుకోవచ్చు.
వీటితో పాటు, ‘పుష్ప 2’ తదితర క్రేజీయెస్ట్ ప్రాజెక్టులు అనసూయ చేతిలో వున్నాయ్. అన్నట్లు ఈ మధ్యనే తన బిజీ షెడ్యూల్ కారణంగా ‘జబర్దస్త్’ షోకి అనసూయ గుడ్ బై చెప్పేసిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన ఇరాన్ IRGC ఆఫీసర్ హతం
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ









