అయ్యో పాపం తమన్నా.! అప్పుడలా.. ఇప్పుడిలా.!
- July 05, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకి మోక్షం కుదరట్లేదు. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని జూలై 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు.
అయితే, కొన్ని అనూహ్య కారణాల వల్ల ఈ సినిమా ఆగస్ట్ 5కు వాయిదా పడింది. నిజానికి ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా ఇది. కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీని తలపిస్తున్నట్లున్నాయ్.
కానీ, ఈ ఫీల్ గుడ్ మూవీ రిలీజ్కి మాత్రం సరైన ఫీల్ ఏర్పడడం లేదు. ఆగస్టులోనైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలీయని పరిస్థితి. అన్నట్లు తమన్నా గతంలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం కూడా ఇలాగే అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రిలీజే కాలేదు ఆ సినిమా.
మరోవైపు సత్యదేవ్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. మొన్నీ మధ్యనే ‘గాడ్ సే’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ‘గుర్తుందా శీతాకాలం’ సత్యదేవ్కి ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాడు సత్యదేవ్.చూడాలి మరి, ఆగస్ట్ 5 న ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో.
తాజా వార్తలు
- వాట్సాప్కు ధీటైన స్వదేశీ యాప్!
- భవిష్యత్తు అంతా AI: సీఎం చంద్రబాబు
- కూలిన మిలిటరీ హెలికాప్టర్: ఆరుగురు మృతి
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరం!
- యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక పరిణామం..
- గల్ఫ్లో ఇరాన్ ప్రతీకారం..అమెరికా రాడార్ వ్యవస్థలు ధ్వంసం
- ఇరాన్ దాడులు..పబ్లిక్ హెల్త్ పై డబ్ల్యూహెచ్ఓ ఆందోళన..!!
- పిల్లిని రక్షించడానికి ప్రాణాలను పణంగా పెట్టిన వ్యక్తి..!!
- దమ్మామ్ మీదుగా కైరోకు.. కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- వెహికల్ నాయిస్ లిమిట్స్, మోడిఫికేషన్ పై హెచ్చరిక జారీ..!!









