అయ్యో పాపం తమన్నా.! అప్పుడలా.. ఇప్పుడిలా.!
- July 05, 2022
మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాకి మోక్షం కుదరట్లేదు. సత్యదేవ్, తమన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాకి నాగశేఖర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని జూలై 15న విడుదల చేసేందుకు సన్నాహాలు చేశారు.
అయితే, కొన్ని అనూహ్య కారణాల వల్ల ఈ సినిమా ఆగస్ట్ 5కు వాయిదా పడింది. నిజానికి ఎప్పుడో విడుదల కావల్సిన సినిమా ఇది. కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. ఈ మధ్య విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు ఫీల్ గుడ్ రొమాంటిక్ మూవీని తలపిస్తున్నట్లున్నాయ్.
కానీ, ఈ ఫీల్ గుడ్ మూవీ రిలీజ్కి మాత్రం సరైన ఫీల్ ఏర్పడడం లేదు. ఆగస్టులోనైనా ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో తెలీయని పరిస్థితి. అన్నట్లు తమన్నా గతంలో నటించిన ‘దటీజ్ మహాలక్ష్మి’ చిత్రం కూడా ఇలాగే అయ్యింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా రిలీజే కాలేదు ఆ సినిమా.
మరోవైపు సత్యదేవ్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు. మొన్నీ మధ్యనే ‘గాడ్ సే’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించాడు. మెగాస్టార్ చిరంజీవితో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. ‘గుర్తుందా శీతాకాలం’ సత్యదేవ్కి ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని ఆశిస్తున్నాడు సత్యదేవ్.చూడాలి మరి, ఆగస్ట్ 5 న ఈ సినిమా రిలీజ్ అవుతుందో లేదో.
తాజా వార్తలు
- సౌదీ నౌకపై హౌతీ దాడి.. ఖండించిన బ్రిటన్, జీసీసీ దేశాలు, జోర్డాన్..!!
- బహ్రెయిన్, కువైట్ కు సర్వీసులు నిలిపేసిన ఖతార్ ఎయిర్వేస్..!!
- అల్-అబ్దాలి చెక్పోస్ట్పై డ్రోన్ దాడి..ప్రాణనష్టం జరగలేదు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై ఒమన్, ఫ్రాన్స్ చర్చలు..!!
- బహ్రెయిన్లో ప్రభుత్వ సేవలకు డిజిటల్ ఊతం..!!
- విదేశాలకు వెళ్లే గోల్డెన్ వీసా హోల్డర్లకు యూఏఈ కీలక సూచనలు..
- ఏపీ అస్త్రం యాప్ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు
- 26 రోజుల పోరాటానికి తెర.. సోనమ్ వాంగ్చుక్ దీక్ష విరమణ
- ఫుజైరాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లి, ఏడాది చిన్నారి మృతి..!!
- శాంతియుత అణుశక్తి వినియోగం పై అమెరికా–సౌదీ మధ్య కీలక ఒప్పందం







