ఆంధ్ర కళా వేదిక వారి మెగా రక్తదాన శిబిరం
- July 05, 2022
దోహా: ఆంధ్ర కళా వేదిక - ఖతార్ మేనేజింగ్ కమిటీ ఆజాదీ కా అమృత్ మహోత్సవం సందర్భంగా 01 జూలై 2022న హమద్ మెడికల్ కార్పొరేషన్ బ్లడ్ డోనార్ సెంటర్లో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది.
మొదటిసారిగా ఇంత పెద్ద సంఖ్యలో దాతలను ఏర్పాటు చేసినందుకు హెచ్ఎంసి బ్లడ్ డోనార్ యూనిట్ కో-ఆర్డినేటర్లు ఆంధ్ర కళా వేదికకు తమ ప్రత్యేక అభినందనలు తెలియజేసి ప్రశంసా పత్రాన్ని అందించారు.
భారత రాయబార కార్యాలయం యొక్క అపెక్స్ బాడీ అయినటువంటి ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) నుండి వైస్ ప్రెసిడెంట్- సుబ్రమణ్య హెబ్బగులు, జనరల్ సెక్రటరీ-కృష్ణ కుమార్, అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్-కె.ఎస్. ప్రసాద్, ఇండియన్ కమ్యూనిటీ బెనివలెంట్ ఫోరమ్ (ICBF) నుండి మెడికల్ క్యాంప్స్ & మెడికల్ అసిస్టెన్స్ హెడ్ - రజనీ మూర్తి, ఈ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఇటువంటి ఉదాత్తమైన సామాజిక సహాయ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు ఆంధ్ర కళా వేదిక MC బృందాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సంఘాల నాయకులు కర్నాటక సంఘం అధ్యక్షుడు -మహేష్ గౌడ, తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు-శంకర్ గౌడ్, తెలంగాణ ప్రజా సమితి ప్రధాన-కార్యదర్శి-వెంకటేష్ పొట్ట, మరికొంతమంది ఆయా సంఘాల సీనియర్ సభ్యులు సత్యనారాయణ మలిరెడ్డి,హరీష్ రెడ్డి,గొట్టిపాటి రమణ మొదలగువారు ఈ కార్యక్రమంలో పాల్గొని హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడుతూ ఎన్నో అవాంతరాలు ఎదురైనా తమ MC బృందం ఈ మెగా రక్తదాన శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించిందని, దీనికి తెలుగు వారి నుండి విశేష స్పందన లభించిందని తెలిపారు. 100 మందికి పైగా దాతలు నమోదు చేసుకున్నారు మరియు రక్తదానం చేశారు.ఈ భారీ విజయంలో భాగమైనందుకు దాతలు మరియు మద్దతుదారులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు, ముఖ్యంగా నవయుగ రెసిడెంట్ డైరెక్టర్- సిహెచ్.రవికిషోర్ కి ఈ కార్యక్రమాన్ని సుసాధ్యం చేసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.అంతేకాక ఈ కార్యక్రమానికి సహకరించిన వాలంటీర్లకు తన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.దాతలందరికీ ప్రశంసా పత్రాలు అందించారు.ఈ కార్యక్రమాన్ని టీమ్ సభ్యులు విక్రమ్ సుఖవాసి,విబికె మూర్తి, శ్రీ సుధ, శిరీష రామ్,సాయి రమేష్ మరియు సోమరాజు చాలా చక్కగా నిర్వహించారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)



తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







