వాణిజ్య మోసాలకు పాల్పడిన వారికి జైలు మరియు జరిమానా

- July 06, 2022 , by Maagulf
వాణిజ్య మోసాలకు పాల్పడిన వారికి జైలు మరియు జరిమానా

దమ్మమ్: సౌదీ అరేబియాలోని తూర్పు ప్రావిన్స్ లో వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన మోసాలకు పాల్పడిన 10 మంది విదేశీ కార్మికులకు అక్కడి దమ్మమ్ క్రిమినల్ కోర్టు జైలు శిక్ష మరియు జరిమానా విధించినట్లు తూర్పు ప్రావిన్స్ వాణిజ్య మంత్రిత్వశాఖ ప్రకటంచింది. 

ఖతిఫ్ గవర్నరేట్ లో ఏటువంటి ప్రభుత్వ గుర్తింపు లైెన్సులను లేకుండా నడుపుతున్న పొగాకు కంపెనీ గత కొన్నాళ్లుగా తన అమ్మకాల్లో పలు వాణిజ్య అవకతవకలకు పాల్పడినట్లు మంత్రిత్వశాఖ ఆరోపించింది. ఈ వ్యవహారంలో కంపెనీ యజమాని కి అక్కడ పనిచేస్తున్న విదేశీ కార్మికులు సహకరించారు. 

ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన కోర్టు   కంపెనీ యజమానికి సంవత్సరం జైలు శిక్ష, అతనికి సహకరించిన 10 మంది భారత్, బంగ్లాదేశ్ చెందిన విదేశీ కార్మికులకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అలాగే SR 720000 జరిమానా సైతం విధించింది. కంపెనీ పొగాకు ఉత్పత్తులను మరియు కంపెనీ కి సంబంధించిన కీలకమైన ఫైళ్ళను జప్తు చేసేందుకు అధికారులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

సౌదీ అరేబియా వాణిజ్య వ్యతిరేక కార్యకలాపాల చట్టం ప్రకారం ఎవరైతే వాణిజ్య మోసాలకు SR 1 మిలియన్ జరిమానా మరియు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించడం జరుగుతుంది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com