యజమానిని చంపిన వ్యక్తికి మరణశిక్ష ఖరారు
- July 07, 2022
యూఏఈ: తన యజమానిని హత్య చేసిన కేసులో 30 ఏళ్ల ఆసియా వ్యక్తికి అజ్మాన్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఘటనా స్థలంలో ఉన్న నిఘా కెమెరాల్లో ఈ దారుణానికి సంబంధించిన వివరాలు రికార్డయ్యాయి. కోర్టు ఫైల్స్ ప్రకారం.. అజ్మాన్ సెంటర్లోని ఫలహారశాల సమీపంలో కత్తిపోటు సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికే బాధితుడు మృతి చెందాడు. బాధితుడిని నిందితుడు వెంబడించి పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయినట్లు సీసీ ఫుటేజీ ద్వారా ధృవీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని ప్రశ్నించగా.. తమ దేశానికే చెందిన కంపెనీ యజమానిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితుడు తనను ఉద్యోగం చేసేందుకు టూరిస్ట్ వీసాపై యూఏఈకి తీసుకొచ్చాడని, అలాగే తమ దేశం నుంచి మరింత మంది కార్మికులను తీసుకురావడానికి ఒప్పందం చేసుకున్నాడని తెలిపాడు. ఈ క్రమంలో తొమ్మిది మందికి వీసాలు ఇప్పించేలా తమ మధ్య ఒప్పందం కుదిరిందని నిందితుడు పేర్కొన్నారు. కానీ తొమ్మిది మందికి రెసిడెన్సీ ప్రక్రియలను పూర్తి చేసేందుకు మృతుడు నిరాకరించాడని, పైగా నాలుగు నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేదని నిందితుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తెలియజేశాడు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







