యజమానిని చంపిన వ్యక్తికి మరణశిక్ష ఖరారు
- July 07, 2022
యూఏఈ: తన యజమానిని హత్య చేసిన కేసులో 30 ఏళ్ల ఆసియా వ్యక్తికి అజ్మాన్ క్రిమినల్ కోర్టు మరణశిక్ష విధించింది. ఘటనా స్థలంలో ఉన్న నిఘా కెమెరాల్లో ఈ దారుణానికి సంబంధించిన వివరాలు రికార్డయ్యాయి. కోర్టు ఫైల్స్ ప్రకారం.. అజ్మాన్ సెంటర్లోని ఫలహారశాల సమీపంలో కత్తిపోటు సంఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకునే సమయానికే బాధితుడు మృతి చెందాడు. బాధితుడిని నిందితుడు వెంబడించి పలుమార్లు కత్తితో పొడిచి పారిపోయినట్లు సీసీ ఫుటేజీ ద్వారా ధృవీకరించారు. పబ్లిక్ ప్రాసిక్యూషన్ నిందితుడిని ప్రశ్నించగా.. తమ దేశానికే చెందిన కంపెనీ యజమానిని ఉద్దేశపూర్వకంగా హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. బాధితుడు తనను ఉద్యోగం చేసేందుకు టూరిస్ట్ వీసాపై యూఏఈకి తీసుకొచ్చాడని, అలాగే తమ దేశం నుంచి మరింత మంది కార్మికులను తీసుకురావడానికి ఒప్పందం చేసుకున్నాడని తెలిపాడు. ఈ క్రమంలో తొమ్మిది మందికి వీసాలు ఇప్పించేలా తమ మధ్య ఒప్పందం కుదిరిందని నిందితుడు పేర్కొన్నారు. కానీ తొమ్మిది మందికి రెసిడెన్సీ ప్రక్రియలను పూర్తి చేసేందుకు మృతుడు నిరాకరించాడని, పైగా నాలుగు నెలలుగా వారికి జీతాలు ఇవ్వలేదని నిందితుడు పబ్లిక్ ప్రాసిక్యూషన్కు తెలియజేశాడు.
తాజా వార్తలు
- సోషల్ మీడియాకు KYC తప్పనిసరి..
- ఏపీ ప్రజలకు హెచ్చరిక..3 నెలలు తీవ్రమైన ఎండలు, వడగాలులు..
- లేపాక్షి రాయితీ అమ్మకాలకు విశేష స్పందన
- ఆయుష్మాన్ భారత్..రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స...
- వైజాగ్ ఆర్కే బీచ్లో కేఎఫ్సీ..ఇసుకతో భారీ ‘బకెట్’ ఆవిష్కరణ!
- మహిళా రిజర్వేషన్ల బిల్లులో ఓబీసీ సబ్ కోటా తప్పనిసరి: కల్వకుంట్ల కవిత
- యురేనియం నిల్వల గురించి లోక్ సభలో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- ఇరాన్కు అమెరికా పలు కీలక ప్రతిపాదనలు..అందులో ఏమున్నాయంటే?
- ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలితో జీసీసీ రాయబారులు భేటీ..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్ళు..హెచ్చరికలు జారీ..!!









