అంతర్జాతీయ స్థాయిలో బాలల కథ, కవితల పోటీ
- July 09, 2022
ఆంధ్ర సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ఆజాదీకా అమృత్ మహోత్సవం సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యార్థినీ విద్యార్థులకు కథా, కవితల పోటీని నిర్వహిస్తున్నట్టు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 16 సంవత్సరాల లోపు తెలుగు పిల్లలందరూ ఈ పోటీకి అర్హులన్నారు.
కథలు,కవితలు దేశభక్తి, భారత స్వాతంత్ర్య ఉద్యమం, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, భారత దేశ ఘన చరిత్రపై ఉండాలన్నారు.
స్వీయ రచనలు ఈ పోటీకి మాత్రమే రాసినవై ఉండాలని, వాట్సాప్, వెబ్సైట్,మరియు పత్రికల్లో మరెక్కడ ప్రచురించి ఉండకూడదనీ తెలిపారు.కవితలు 20 పంక్తులకు మించి ఉండకూడదని,
కథ చేతిరాత 3 పుటలకు మించి ఉండకూడదని, ప్రింటింగ్ లో A4 సైజులో మాత్రమే అంటే సింగిల్ పేజీ కథ .చేతిరాత బాగలేనివారు డి.టి.పి కానీ ఇతరులచే అందంగా రాసి పంపాలన్నారు.కథ,కవిత పిల్లల సొంతమని తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ హామీ పత్రాన్ని తప్పనిసరిగా జతచేయాలన్నారు.
రచనలో రాసిన వారి పేరు ఉండకూడదనీ,.హామీ పత్రంలో మాత్రమే ఉండాలన్నారు. విద్యార్థి పేరు,తరగతి ,ఊరు,జిల్లా , రాష్ట్రం,దేశం, సెల్ ఫోన్ నెంబర్ ఉండాలి .పోస్ట్ ద్వారా కానీ మెయిల్ ద్వారా గాని కథలు, కవితలు
ఆవుల చక్రపాణి యాదవ్
S.A తెలుగు
ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల ఉర్దూ,గడియారం హాస్పిటల్ ప్రక్కన
కర్నూలు - 518001అనే చిరునామాకు పంపాలన్నారు. వివరాలకు 9963350973 సంప్రదించవచ్చన్నారు.విజేతలకు ప్రశంసా పత్రాలు,జ్ణాపిక,నగదుబహుమతులు ఇవ్వబడతాయని తెలిపారు.పాల్గొన్న ప్రతి విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని పోస్టు ద్వారా గాని మెయిలు ద్వారాగాని పంపబడతాయనీ తెలిపారు. కవితలు,కథలు తెలుగులో మాత్రమే ఆగష్ట్ 8 వతేదీ లోపుగా పంపాలన్నారు.బహుమతీ ప్రధానం ఆగస్టు 28న నంద్యాలలో సాయంత్రం 4 గం. ఉంటుందని తెలిపారు.కవితలు,కథల పోటీలలో
ప్రథమ బహుమతి 5,000/-,
ద్వితీయ బహుమతి 3,000/-
తృతీయ బహుమతి 2,000/-
మూడు ప్రోత్సాహ బహుమతులు ఒక్కొక్కరికి వెయ్యి రూపాయల చొప్పున 3,000 /- అందచేయబడతాయనీ ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు డాక్టర్ గజల్ శ్రీనివాస్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







