శ్రీలంకకు అండగా ఉంటాం: భారత్
- July 10, 2022
ప్రస్తుతం సంక్షోభ సమయంలో శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని భారత్ హామీ ఇచ్చింది. శ్రీలంకలో నెలకొన్న తాజా సంక్షోభం నేపథ్యంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. క్లిష్ట సమయంలో శ్రీలంకను ఆదుకుంటామని ప్రకటించింది. విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
‘‘శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అవగాహన ఉంది. మేం శ్రీలంక ప్రజలకు అండగా ఉంటాం. వాళ్లు ఈ క్లిష్ట పరిస్థితుల్ని దాటేందుకు సహకరిస్తాం. అదనంగా మరో 3.8 బిలియన్ డాలర్ల సహాయం అందిస్తాం. శ్రీలంక ప్రజలు ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, ప్రజా స్వామికంగా నిలదొక్కుకునేందుకు సహకరిస్తాం’’ అని బాగ్చి తన ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీలంక ప్రజలు ఆందోళనకు దిగిన నేపథ్యంలో అధ్యక్షుడు రాజపక్స రాజీనామా చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13న ఆయన రాజీనామా చేయనున్నారు.
ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నారు. మరోవైపు ప్రధాని విక్రమ సింఘే కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆయన నివాసాన్ని కూడా ఆందోళనకారులు ధ్వంసం చేశారు. అయితే, అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి, అందరి తరఫున కొత్త ప్రధానిని ఎన్నుకుంటానని విక్రమ సింఘే చెప్పారు.
తాజా వార్తలు
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం







