సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు
- July 12, 2022
తిరుమల: టీటీడీ పాలక మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన పాలకమండలి సెప్టెంబర్ 27న జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. కొవిడ్ తగ్గుముఖం పట్టడంతో బ్రహ్మోత్సవ వేడుకలను మాడవీధుల్లో జరపడానికి టీటీడీ పాలక మండలి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. సెప్టెంబరు 27 నుంచి అక్టోబరు 5 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి.
తిరుమలలోని బేడి ఆంజనేయ స్వామివారికి వెండి కవచాల స్థానంలో బంగారు కవచాలు అమర్చాలని నిర్ణయం తీసుకున్నారు. అమరావతిలోని శ్రీవారి ఆలయంలో సుందరీకరణకు 2.90 కోట్ల రూపాయలు కేటాయించారు. 2కోట్ల 70 లక్షల రూపాయలతో పార్వేట మండపం నూతన భవన నిర్మాణానికి పాలక మండలి ఆమోదం తెలిపింది.
అలాగే సింఘానియా ట్రస్టు ద్వారా తిరుమలలోని టీటీడీ పాఠశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందించాలని నిర్ణయించారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహించేందుకు ఏపీ మార్క్ ఫెడ్తో ఒప్పందం చేసుకున్నారు. తిరుమలలో ఆక్టోపస్ భవన నిర్మాణం పూర్తి చేయడానికి 7 కోట్ల రూపాయలు కేటాయించారు.
అలాగే ఆటోమెటిక్ మెషిన్లతో లడ్డూ బూందీ తయారీపై కూడా చర్చించారు. సర్వదర్శన భక్తులకు స్లాట్ విధానంపై టీటీడీ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. భక్తుల రద్దీ తగ్గేంతవరకు సర్వదర్శన భక్తులకు ప్రస్తుత విధానమే అమలు చేస్తామని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







