‘కోబ్రా’ ఈవెంట్ కి హాజరైన విక్రమ్: అందుకే ఆయన మిస్టర్ పర్ఫెక్ట్
- July 12, 2022
తమిళ స్టార్ హీరో విక్రమ్కి హార్ట్ ఎటాక్ వచ్చిందనీ ఆసుపత్రిలో చేరారనీ, ఆయన ఆరోగ్యం విషమంగా వుందంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. నిజమే. విక్రమ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన విషయం నిజమే. కానీ ఆయనకు హార్ట్ ఎటాక్ రాలేదు. ఛాతీలో నొప్పి కారణంగా చిన్న క్యాజువల్ ట్రీట్మెంట్ తీసుకున్నాడంతే విక్రమ్.
ఈ విషయాన్ని గట్టిగా ప్రచారం చేయొద్దంటూ ఆయన బాగానే వున్నారంటూ విక్రమ్ తనయుడు ధృవ్ ఈ విషయంలో ఒకింత అసహనం వ్యక్తం చేసిన సంగతి కూడా తెలిసిందే. అయితే, విక్రమ్ పూర్తి ఆరోగ్యంతో వున్నారు. ఆయన తాజా చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’ (కోబ్రా) ఈవెంట్లో విక్రమ్ కనిపించారు.
నిజానికి ఆయన అనారోగ్యం కారణంగానే మొన్న ఎప్పుడో జరగాల్సిన ఈ ఈవెంట్ వాయిదా పడింది. కాగా, ఈ ఈవెంట్లో విక్రమ్ చాలా ఫిట్ అండ్ పర్ఫెక్ట్గా కనిపించి, అభిమానుల్ని ఆశ్చర్యపరిచారు. తన అనారోగ్యం కారణంగా, అభిమానులు సోషల్ మీడియా వేదికగా చేసిన హంగామాకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే, తన ఆరోగ్యం పట్ల కొందరు చేసిన అసత్య ప్రచారాన్ని కూడా ఆయన ఖండించారు. అలాంటి ప్రచారాల వల్ల కొందరు చాలా చాలా ఆందోళన చెందుతారనీ, దయచేసి, అలాంటి ప్రచారాలు ఎప్పుడూ చేయొద్దనీ, తనపై ప్రేమ చూపించిన అభిమానులకు ఎన్నిసార్లు థాంక్స్ చెప్పినా తక్కువే అవుతుందని విక్రమ్ స్పందించారు.
ఇక, పొన్నియన్ సెల్వన్ సినిమా విషయానికి వస్తే, ఈ సినిమాని రెండు పార్టులుగా తెరకెక్కించారు. మణిరత్నం డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది.
తాజా వార్తలు
- యూఏఈలో ఐక్యతను చాటిచెప్పిన ఈద్ ప్రార్థనలు..!!
- రిఫైనరీలు లక్ష్యంగా డ్రోన్ అటాక్స్..KPC క్లారిటీ..!!
- $20 బిలియన్ల నష్టం..17% దెబ్బతిన్న LNG ఎగుమతి సామర్థ్యం..!!
- సీబీఎస్ఈ క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్ పై పేరెంట్స్ ఆందోళన..!!
- అల్ ఖోర్ మసీదులో కింగ్ సుల్తాన్ ఈద్ ప్రార్థనలు..!!
- ఈద్ వేడుకలు.. అబుదాబి పోలీసుల హెచ్చరిక..!!
- మక్కాలోని గ్రాండ్ మసీదులో క్రౌన్ ప్రిన్స్ ఈద్ ప్రార్థనలు..!!
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!









