సింగపూర్ ఓపెన్ టైటిల్ విజేత సింధూ..
- July 17, 2022
సింగపూర్: భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ సింగపూర్ ఓపెన్-2022 ఉమెన్స్ టైటిల్ గెలుచుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో చైనా క్రీడాకారిణి వాంగ్ జి యిపై, సింధు విజయం సాధించారు. 21-9, 11-21, 21-15 తేడాతో సింధు, వాంగ్ జిని ఓడించింది. మొదటి గేమ్ను సింధు గెలుచుకోగా, రెండో గేమ్లో దారుణంగా ఓడిపోయింది.
తర్వాత చివరిదైన మూడో గేమ్లో అద్భుత ప్రతిభ కనబరిచి, సింగపూర్ ఓపెన్, సూపర్ 500 టైటిల్ గెలుచుకుంది. భారత దేశం నుంచి ఈ టైటిల్ సాధించిన రెండో క్రీడాకారిణిగా సింధు నిలిచింది. ఇంతకుముందు ఈ టైటిల్ సైనా నెహ్వాల్ గెలుచుకుంది. పురుషుల విభాగంలో 2017లో సాయి ప్రణీత్ కూడా గెలుపొందాడు. ఈ ఏడాది ఇది సింధు గెలిచిన మూడో టైటిల్ కాగా, మొదటి సూపర్-500 టైటిల్. ఇంతకుముందు గెలిచిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్, స్విస్ ఓపెన్.. రెండూ సూపర్-300 టైటిళ్లే.
వరల్డ్ ఛాంపియన్షిప్, ఒలింపిక్స్ మెడల్స్తో కలిపి ఇది సింధు తన కెరీర్లో సాధించిన 18వ టైటిల్. సింధు సాధించిన ఈ విజయం ఈ నెల 28న బర్మింగ్హమ్లో ప్రారంభం కానున్న కామన్వెల్త్ గేమ్స్కు మరింత స్ఫూర్తినిస్తుంది. ఈ విజయం తనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని, తను మరో మెట్టు ఎక్కేందుకు దోహద పడుతుందని సింధు మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించింది.
తాజా వార్తలు
- RBVRR పోలీస్ అకాడమీలో ప్రొబేషనరీ డిప్యూటీ సూపరింటెండెంట్స్ శిక్షణ ప్రారంభం
- 80వేల వీసాలను రద్దు చేసిన డొనాల్డ్ ట్రంప్
- వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికైన తొలి భారతీయ ముస్లిం మహిళ
- ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్య గమనిక..
- WPL 2026 రిటెన్షన్ లిస్ట్ ఇదే..
- టీ20 ప్రపంచకప్ ఫైనల్కు వేదిక ఖరారు..!
- తెలంగాణలో కొత్తగా మూడు టీటీడీ దేవాలయాలు: టీటీడీ ఛైర్మన్
- స్పీడ్మాక్స్ సైకిళ్లను కొనవద్దు..CPA హెచ్చరిక..!!
- దుబాయ్ లో త్వరలో కొత్త వాటర్పార్క్..!!
- బహ్రెయిన్ లో ముగిసిన కొత్త సీజన్ కు రిజిస్ట్రేషన్లు..!!







