కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 12, 2016
నగరంలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 ఇల్లు దగ్ధం అయ్యాయి. ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. పాతబస్తీలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో 200 వందల మంది గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరు రోజువారి కూలీలు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 5 పాక్షికంగా దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపిస్తున్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఘటనాస్థలికి రాలేదు.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







