కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 12, 2016
నగరంలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 ఇల్లు దగ్ధం అయ్యాయి. ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. పాతబస్తీలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో 200 వందల మంది గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరు రోజువారి కూలీలు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 5 పాక్షికంగా దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపిస్తున్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఘటనాస్థలికి రాలేదు.
తాజా వార్తలు
- IPL 2026: ముంబై పై పంజాబ్ ఘన విజయం
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ పూర్తి: షేక్ హందాన్ సమీక్ష
- మైక్రో ఫైనాన్స్ కేసులో బిగ్ ట్విస్ట్: రమావత్ మధు అరెస్ట్!
- ఇజ్రాయెల్–లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం: ట్రంప్ ప్రకటన
- అమెరికా–ఇరాన్ రెండో దఫా చర్చలు
- ఎయిర్ న్యూజిలాండ్ వినూత్న నిర్ణయం
- గ్రేటర్ హైదరాబాద్లో సీట్ల జాతర
- పార్లమెంటులో కీలక బిల్లుల సందడి..
- డీలిమిటేషన్ పై ప్రధాని మోదీ భరోసా...
- ఢిల్లీ ఎయిర్పోర్ట్లో హైటెన్షన్..2 విమానాలు ఢీ!









