కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం
- April 12, 2016
నగరంలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 15 ఇల్లు దగ్ధం అయ్యాయి. ఎలాంటి ప్రాణం నష్టం జరగలేదు. సురక్షితంగా బయటపడ్డారు. పాతబస్తీలోని కుల్సుంపురా కబేళా ప్రాంతంలో 200 వందల మంది గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వీరు రోజువారి కూలీలు. ఈనేపథ్యంలో ఇవాళ ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వంట చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10 ఇళ్లు పూర్తిగా దగ్ధం అయ్యాయి. 5 పాక్షికంగా దగ్ధం అయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. మంటలు చుట్టుపక్కల ఉన్న ఇళ్లకు వ్యాపిస్తున్నాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఇళ్లను ఖాళీ చేయిస్తున్నారు. అయితే రెవెన్యూ అధికారులు ఇప్పటివరకు ఘటనాస్థలికి రాలేదు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







