‘పుష్ప..’ రెండు కాదు మూడు.! అయ్యో.! అల్లు అర్జున్ ఇరికేసినాడే.!
- July 19, 2022
అల్లు అర్జున్, రష్మికా మండన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. నిజానికి చాలా సాదా సీదాగా తెరకెక్కిన ఈ సినిమా, ప్యాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యింది.
ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని విలన్ ఫహాద్ పాజిల్తో పోలీస్ స్టేషన్ సీన్ తెరకెక్కించేటప్పుడే ఆలోచన చేశాడట డైరెక్టర్ సుకుమార్. అది కూడా ఫహాద్ ఫాజిల్ నేపథ్యంలోనేనట. అంటే, సెకండ్ పార్ట్ మొత్తం ఫహాద్ ఫాజిల్ వైపు నుండే వుండేలా ప్లాన్ చేశాడన్న మాట.
అందుకు తగ్గట్లుగానే మొదటి పార్ట్ని అక్కడే కట్ చేశాడు సుకుమార్. ఓకే, ‘పుష్ప 2’ కోసం ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా అప్డేట్ ప్రకారం, ‘పుష్ప’ రెండో పార్టే కాదు, మూడో పార్ట్ కూడా వుండబోతోందట.
ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు కానీ, మూడో పార్ట్ కోసం కూడా రెడీగా వుండమని ఫహాద్ ఫాజిల్కి సుకుమార్ సూచించాడట. తాజాగా ఆయన ఇదే విషయాన్ని బయటికి చెప్పేశారు. కావాలనే చెప్పారో, అనుకోకుండా చెప్పారో కానీ, ‘పుష్ప 3’ సీక్రెట్ రివీల్ అయిపోయింది.
అయితే, మరి బన్నీ పరిస్థితేంటీ.? ఇప్పటికే పుష్ప రెండో పార్ట్ సెట్స్ మీదికెళ్లడానికి చాలా టైమ్ తీసుకుంది. ఇక మూడో పార్ట్ అంటే, అది కూడా పూర్తయ్యే వరకూ బన్నీ వేరే డైరెక్టర్కి కమిట్ అవ్వడానికి లేదు కదా. ఇలా అయితే, బన్నీ ఒకే డైరెక్టర్తో ఇంకెన్నాళ్లో.. ఇరుక్కుపోయాడుగా.!
తాజా వార్తలు
- రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ నిధులు జమ
- తమిళనాడు సీఎం విజయ్ మరో కీలక నిర్ణయం
- TANA ప్రపంచసాహిత్య వేదిక 93వ సమావేశం ఘన విజయం
- సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లో పదవీ విరమణ పొందిన పోలీసు అధికారులు
- యూఏఈలో భారత పాస్పోర్ట్ ఫీజులు పెంపు..
- బోయింగ్ 777-300ERSF కార్గో విమానాన్ని ప్రవేశపెట్టిన తొలి ఎయిర్లైన్గా ఎమిరేట్స్ రికార్డు
- తెలంగాణ స్పెషల్ పోలీసు పనితీరు పై డీజీపీ ఆనంద్ సమీక్ష..
- DRDO కొత్త డైరెక్టర్ జనరల్గా డాక్టర్ జగన్నాథ్ నాయక్
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు







