‘పుష్ప..’ రెండు కాదు మూడు.! అయ్యో.! అల్లు అర్జున్ ఇరికేసినాడే.!
- July 19, 2022
అల్లు అర్జున్, రష్మికా మండన్నా జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పుష్ప’. నిజానికి చాలా సాదా సీదాగా తెరకెక్కిన ఈ సినిమా, ప్యాన్ ఇండియా లెవల్లో హిట్ అయ్యింది.
ఈ సినిమాకి సీక్వెల్ రూపొందించాలని విలన్ ఫహాద్ పాజిల్తో పోలీస్ స్టేషన్ సీన్ తెరకెక్కించేటప్పుడే ఆలోచన చేశాడట డైరెక్టర్ సుకుమార్. అది కూడా ఫహాద్ ఫాజిల్ నేపథ్యంలోనేనట. అంటే, సెకండ్ పార్ట్ మొత్తం ఫహాద్ ఫాజిల్ వైపు నుండే వుండేలా ప్లాన్ చేశాడన్న మాట.
అందుకు తగ్గట్లుగానే మొదటి పార్ట్ని అక్కడే కట్ చేశాడు సుకుమార్. ఓకే, ‘పుష్ప 2’ కోసం ఆడియన్స్ కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తాజా అప్డేట్ ప్రకారం, ‘పుష్ప’ రెండో పార్టే కాదు, మూడో పార్ట్ కూడా వుండబోతోందట.
ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదు కానీ, మూడో పార్ట్ కోసం కూడా రెడీగా వుండమని ఫహాద్ ఫాజిల్కి సుకుమార్ సూచించాడట. తాజాగా ఆయన ఇదే విషయాన్ని బయటికి చెప్పేశారు. కావాలనే చెప్పారో, అనుకోకుండా చెప్పారో కానీ, ‘పుష్ప 3’ సీక్రెట్ రివీల్ అయిపోయింది.
అయితే, మరి బన్నీ పరిస్థితేంటీ.? ఇప్పటికే పుష్ప రెండో పార్ట్ సెట్స్ మీదికెళ్లడానికి చాలా టైమ్ తీసుకుంది. ఇక మూడో పార్ట్ అంటే, అది కూడా పూర్తయ్యే వరకూ బన్నీ వేరే డైరెక్టర్కి కమిట్ అవ్వడానికి లేదు కదా. ఇలా అయితే, బన్నీ ఒకే డైరెక్టర్తో ఇంకెన్నాళ్లో.. ఇరుక్కుపోయాడుగా.!
తాజా వార్తలు
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష
- డల్లాస్ ఫ్రిస్కోలో దిగ్విజయంగా నాట్స్ అడాప్ట్ ఏ పార్క్
- ఆస్ట్రేలియాలో మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం
- అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ శర్మ అరుదైన ఘనత..
- మిస్సోరీలో దిగ్విజయంగా NATS వాలీబాల్, త్రోబాల్ టోర్నమెంట్స్
- ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
- ప్రయాణికులకు అలెర్ట్..దోహా మెట్రో లింక్ సర్వీస్ అప్డేట్..!!
- రియాద్లో జాయ్ ఫోరం 2025..SR4 బిలియన్ ఒప్పందాలు..!!