సైబర్ దాడుల వ్యాప్తి నిరోధంలో ఖతార్ ప్రగతి
- July 20, 2022
ఖతార్: సైబర్-దాడుల వ్యాప్తిని నిరోధించడానికి, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించే ప్రయత్నాలలో ఖతార్ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్లు, కార్పొరేషన్లకు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులను గుర్తించడానికి అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లు ప్రభుత్వ కమ్యూనికేషన్స్ ఆఫీస్ (GCO) ఒక ట్వీట్లో వివరించింది. ప్లాట్ఫారమ్ AI సాంకేతికతలను ఉపయోగించి ఫిషింగ్ డొమైన్లను గుర్తిస్తుందని పేర్కొంది. ఇందులో భాగంగానే హమద్ బిన్ ఖలీఫా విశ్వవిద్యాలయం, ఖతార్ కంప్యూటింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (QCRI) శాస్త్రవేత్తలు సైబర్ భద్రతను అంచనా వేయడానికి.. గుర్తించడానికి 'వార్నింగ్' అనే సైబర్-సెక్యూరిటీ డిఫెన్స్ ప్లాట్ఫారమ్ను విజయవంతంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఖతార్ సైబర్-సెక్యూరిటీని చాలా సీరియస్గా తీసుకుంటోందని, సైబర్-సెక్యూరిటీ ఫ్రేమ్వర్క్ను అభివృద్ధి చేయడం ద్వారా FIFA వరల్డ్ కప్ 2022 ఈవెంట్ ఎజెండాలో సైబర్-సెక్యూరిటీ, గోప్యతను అగ్రస్థానంలో ఉంచిందని దోహా యూనివర్శిటీ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (UDST)లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన ది పెనిన్సులా డాక్టర్ అబ్దుల్లతీఫ్ షిక్ఫాకు తెలిపాడు. ఖతార్ 2013లో జాతీయ సైబర్ సెక్యూరిటీ స్ట్రాటజీని అభివృద్ధి చేసిందని, 2006లోనే ఖతార్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ను ఏర్పాటు చేసిందని ఆయన వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్







