దుబాయ్లోని వాణిజ్య భూములపై నియంత్రణ.. డిక్రీ జారీ
- July 21, 2022
దుబాయ్: దుబాయ్లోని వాణిజ్య భూములపై ‘ముసతహా’ హక్కుల మంజూరును నియంత్రిస్తూ 2022 డిక్రీ నంబర్ (23)ని యూఏఈ వైస్ ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ జారీ చేశారు. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లను అభివృద్ధి చేయడానికి 'ముసతహా' హక్కును మంజూరు చేయడం ద్వారా దుబాయ్లోని వాణిజ్య భూముల వినియోగాన్ని డిక్రీ నియంత్రిస్తుంది. గ్లోబల్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా దుబాయ్ ని మార్చే ప్రయత్నాలలో కొత్త చట్టం భాగమని అధికారులు తెలిపారు. కొత్త డిక్రీ ప్రకారం.. 'ముసతహా' ఒప్పందం దాని హోల్డర్కు భవనాన్ని నిర్మించడానికి లేదా పెట్టుబడి పెట్టడానికి, తనఖా పెట్టడానికి, లీజుకు, విక్రయించడానికి లేదా మూడవ పక్షానికి చెందిన ప్లాట్ను గరిష్ట కాలం(35 ఏళ్లు) వరకు కొనుగోలు చేయడానికి హక్కును ఇస్తుంది. ఈ ఒప్పందాన్ని గరిష్టంగా 50 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







