సౌదీ విమానాశ్రయాల్లో 35శాతం తగ్గనున్న ఛార్జీలు
- July 21, 2022
రియాద్: బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్ హబ్లలో కొన్నింటితో పోటీ పడేందుకు వీలుగా విమానాశ్రయ ఛార్జీలను 35 శాతం తగ్గించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ తగ్గింపు రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జెడ్డా కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డమ్మామ్ కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఎయిర్పోర్టు ఛార్జీల్లో తగ్గింపు ఈ ఏడాది చివర్లో అమల్లోకి రానుందని వెల్లడించింది. రియాద్ను గ్లోబల్ బిజినెస్ హబ్గా మార్చేందుకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వ్యూహంలో ఈ చర్య తాజా దశగా నిపుణులు పేర్కొంటున్నారు. విమానాశ్రయ రంగ ప్రైవేటీకరణలో ఎయిర్పోర్ట్ ఛార్జీల తగ్గింపు తదుపరి దశ అని సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ఫార్న్బరో ఎయిర్ షోలో ప్రకటించింది.
తాజా వార్తలు
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!
- ఎయిర్ పోర్టుల భద్రతకు సమగ్ర ప్రణాళిక అమలు..!!
- బహ్రెయిన్లో మొట్టమొదటి వర్చువల్ హార్స్ వేలం..!!
- వారంలో 1,077 స్మగ్లింగ్ కేసులు నమోదు: సౌదీ కస్టమ్స్
- సుల్తాన్ తో ఇరాన్ విదేశాంగ మంత్రి భేటీ..!!
- కువైట్ ఎయిర్వేస్ టికెట్లు ఆకస్మిక రద్దు – ప్రయాణికుల ఆందోళన
- యూఏఈ అధ్యక్షుడితో భేటీ అయిన భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్









