సౌదీ విమానాశ్రయాల్లో 35శాతం తగ్గనున్న ఛార్జీలు
- July 21, 2022
రియాద్: బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. ఇప్పటికే ప్రపంచంలోని అతిపెద్ద ప్యాసింజర్ హబ్లలో కొన్నింటితో పోటీ పడేందుకు వీలుగా విమానాశ్రయ ఛార్జీలను 35 శాతం తగ్గించనున్నట్లు సౌదీ అరేబియా తెలిపింది. ఈ తగ్గింపు రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జెడ్డా కింగ్ అబ్దుల్ అజీజ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, డమ్మామ్ కింగ్ ఫహద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లకు వర్తిస్తుందని పేర్కొంది. ఎయిర్పోర్టు ఛార్జీల్లో తగ్గింపు ఈ ఏడాది చివర్లో అమల్లోకి రానుందని వెల్లడించింది. రియాద్ను గ్లోబల్ బిజినెస్ హబ్గా మార్చేందుకు క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ వ్యూహంలో ఈ చర్య తాజా దశగా నిపుణులు పేర్కొంటున్నారు. విమానాశ్రయ రంగ ప్రైవేటీకరణలో ఎయిర్పోర్ట్ ఛార్జీల తగ్గింపు తదుపరి దశ అని సౌదీ జనరల్ అథారిటీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (GACA) ఫార్న్బరో ఎయిర్ షోలో ప్రకటించింది.
తాజా వార్తలు
- ఫిబ్రవరి 23న తెలంగాణ క్యాబినెట్ భేటీ
- నాలుగు రాష్ట్రాల ఎన్నికలు ఏప్రిల్లోనా? షెడ్యూల్ పై క్లారిటీ
- విశాఖకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము
- ఎర్రవల్లి ఫామ్ హౌస్ వద్ద కార్యకర్తల సందడి
- పేరుకే ఏఐ సమ్మిట్.. నో యూపీఐ, నో కార్డ్.. ఓన్లీ క్యాష్
- శ్రీసిటీలో క్యారియర్ ఏసీ తయారీ యూనిట్ ప్రారంభం
- కోర్టు తీర్పు పై స్పందించిన ప్రత్యూష తల్లి
- ప్రధానిగా తారిక్ రెహమాన్ ప్రమాణ స్వీకారం
- ఐబొమ్మ’ రవికి బెయిల్ మంజూరు
- బడ్జెట్ తర్వాత భారీగా పెరిగిన ‘సిగరెట్’ ధరలు









