వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదలడం.. యూఏఈలో శిక్షార్హమైన నేరం
- July 23, 2022
యూఏఈ: వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదలడం యూఏఈలో శిక్షార్హమైన నేరమని అబుదాబి పోలీసులు తెలిపారు. "సేఫ్ సమ్మర్" ప్రచారంలో భాగంగా వాహనదారులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ వేసవి వాతావరణంలో పిల్లలను వాహనాల లోపల వదలొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని, చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని పేర్కొంది. అలాంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పిల్లలను వాహనాల్లో వదిలేయడం వల్ల వారు చనిపోవడం లేదా ఊపిరాడకుండా పోయే అవకాశం ఉందని, పిల్లలు కారు కీని ట్యాంపరింగ్ చేసి మూసివేయడం వల్ల ఆక్సిజన్ తగ్గి.. వాహనం లోపల అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని పోలీసులు వివరించారు. కారులోపల చిన్నారులు ఊపిరాడక చనిపోతున్న ఘటనలు, కుటుంబాలు పట్టించుకోకపోవడంతో వారు ఒంటరిగా ఉంటున్నారని, ఆ చిన్నారికి తన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడం వల్లేనని ఈ సందర్భంగా అబుదాబి పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడి..10 మంది మృతి
- ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త తెలిపిన తెలంగాణ ప్రభుత్వం
- డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీల జారీలో కీలక మార్పు
- అజ్మాన్ కొత్త మాస్టర్ ప్లాన్: ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్..
- CBSE 10వ తరగతి కొత్త నిబంధనలు: మొదటి బోర్డు పరీక్ష తప్పనిసరి..
- రమదాన్ ఇ-భిక్షాటనకు AI వినియోగం..హెచ్చరిక జారీ..!!
- యుద్ధం ముంచుకొస్తోందా? ఇరాన్ చుట్టూ పెరుగుతున్న ఉద్రిక్తతలు
- గాజాకు 100 టన్నుల అత్యవసర సహాయం ఎయిర్ లిఫ్ట్..!!
- వీకెండ్ లో పొగమంచు.. పగలు వేడి, రాత్రిళ్లు కూల్..!!
- ఒమన్ లో ఈద్ అల్ ఫితర్ సెలవులు ఎన్ని రోజులు?









