వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదలడం.. యూఏఈలో శిక్షార్హమైన నేరం
- July 23, 2022
యూఏఈ: వాహనాల్లో పిల్లలను ఒంటరిగా వదలడం యూఏఈలో శిక్షార్హమైన నేరమని అబుదాబి పోలీసులు తెలిపారు. "సేఫ్ సమ్మర్" ప్రచారంలో భాగంగా వాహనదారులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా ఈ వేసవి వాతావరణంలో పిల్లలను వాహనాల లోపల వదలొద్దని విజ్ఞప్తి చేశారు. ఇది వారి ప్రాణాలకు ముప్పు కలిగిస్తుందని, చట్టం ప్రకారం శిక్షార్హమైన నేరమని పేర్కొంది. అలాంటి కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పిల్లలను వాహనాల్లో వదిలేయడం వల్ల వారు చనిపోవడం లేదా ఊపిరాడకుండా పోయే అవకాశం ఉందని, పిల్లలు కారు కీని ట్యాంపరింగ్ చేసి మూసివేయడం వల్ల ఆక్సిజన్ తగ్గి.. వాహనం లోపల అధిక ఉష్ణోగ్రతలు ఏర్పడతాయని పోలీసులు వివరించారు. కారులోపల చిన్నారులు ఊపిరాడక చనిపోతున్న ఘటనలు, కుటుంబాలు పట్టించుకోకపోవడంతో వారు ఒంటరిగా ఉంటున్నారని, ఆ చిన్నారికి తన చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి అవగాహన లేకపోవడం వల్లేనని ఈ సందర్భంగా అబుదాబి పోలీసులు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- ఖమేనీ వీడ్కోలు వేడుకల్లో భారత్.. కేంద్ర మంత్రి నివాళి
- ధరల ఉల్లంఘనలు..వాణిజ్య సముదాయం మూసివేత..!!
- అమెరికా అధ్యక్షుడికి ఒమన్ సుల్తాన్ అభినందనలు..!!
- ఉద్యోగ మార్పిడి వెసులుబాటుతో 27వేల మంది కార్మికులకు ప్రయోజనం..!!
- ఆన్లైన్ ఫ్రాడ్ కేసులో ముగ్గురు ప్రవాసులకు జైలు శిక్ష..!!
- అభాలో అమ్యూజ్మెంట్ రైడ్ ప్రమాదం పై విచారణ ప్రారంభం..!!
- ఖతార్ లో వార్షిక ఆరోగ్య పరీక్షలను ప్రారంభించిన పీహెచ్సీసీ..!!
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..







