గల్ఫ్ టీడీపీ కౌన్సిల్ అధ్యక్షుడిగా రావి రాధాకృష్ణ
- July 23, 2022
సౌదీ అరేబియా: తెలుగుదేశం పార్టీ (TDP) ఎన్నారై విభాగం గల్ఫ్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఆంధ్ర ప్రదేశ్ లోని కోనసీమ జిల్లా మల్కిపురానికి చెందిన ప్రవాస పారిశ్రామికవేత్త, సౌదీ అరేబియా నివాసి రావి రాధాకృష్ణను నియమించారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. 25 ఏళ్లుగా ఆయన టీడీపీ పటిష్ఠతకు పని చేస్తున్నారు.గల్ఫ్ దేశాల్లో టీడీపీ కమిటీల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు.గత టీడీపీ ప్రభుత్వంలో ప్రవాసీయుల కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన ఏపీఎన్ఆర్టీని గల్ఫ్ దేశాల్లో విస్తరించడంలో రాధాకృష్ణ కీలకంగా వ్యవహించారు. శృంగవరపుపాడు గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ స్వచ్ఛ నీటి కేంద్రం, డిజిటల్ క్లాస్ రూమ్ల ఏర్పాటు దేవాలయాల పునరుద్ధరణ వంటి పనులు చేశారు.
తాజా వార్తలు
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు







