తెలంగాణలో మంకీపాక్స్ టెన్షన్..
- July 26, 2022
తెలంగాణ: కామారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడటం కలకలం రేపింది. మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు బయటపడిన వ్యక్తి నివసించిన ఇందిరానగర్ కాలనీలో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. 200 మీటర్ల పరిధిలో ఆంక్షలు విధించారు. ఆ ప్రాంతాన్ని పూర్తిగా శానిటైజ్ చేశారు. అతడితో ప్రైమరీ కాంటాక్ట్ లో ఉన్న 8మంది హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు.
మరోవైపు మంకీపాక్స్ అనుమానిత లక్షణాలు ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోని ఫీవర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రత్యేక వార్డులో డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నాడు. అతడి నుంచి 5 రకాల నమూనాలు సేకరించి పరీక్షల నిమిత్తం పుణెలోని వైరాలజీ ల్యాబ్ కి పంపారు. త్వరలోనే మెడికల్ రిపోర్ట్స్ వచ్చే అవకాశం ఉంది.
ఈ నెల 6న కువైట్ నుంచి వచ్చిన ఇందిరానగర్ కాలనీ వాసిలో మంకీపాక్స్ లక్షణాలు బయటపడ్డాయి. 20న జ్వరం వచ్చింది. 23 నాటికి ఒళ్లంతా ర్యాషెస్ రావడంతో కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. ఆ వ్యక్తిని పరిశీలించిన డాక్టర్లు.. మంకీపాక్స్ లక్షణాలు కనిపించడంతో ఫీవర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
తాజా వార్తలు
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!
- డమాస్కస్ కేఫ్ బాంబు దాడిని ఖండించిన ఒమన్..!!
- ఖతార్ అంతటా కస్టమర్ సాటిస్పెక్షన్ సర్వే 2026..!!
- జూన్ నెలలో 911 నెంబర్ కు 26 లక్షల కాల్స్..!!
- యూఏఈలో చిల్డ్రన్ మీడియా కంటెంట్ కోసం కొత్త ప్రమాణాలు..!!
- సింగిల్ స్క్రీన్ థియేటర్లకు ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రోత్సాహకాలు
- జర్మనీలో ఉద్యోగాలకు ఏపీఎస్ఎస్డీసీ అవకాశం..
- ముగిసిన తెలంగాణ ‘ఈ కేబినెట్’ భేటీ.. మూసీ ప్రాజెక్టు ఫేజ్-1కు ఆమోదం
- దుబాయ్లో ట్యాక్సీ డ్రైవర్లకు భారీ ఉద్యోగావకాశం







