కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 14 ఏళ్ల ఖతార్ బాలిక

- July 27, 2022 , by Maagulf
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన 14 ఏళ్ల ఖతార్ బాలిక

దోహా: దోహాలోని ఓరిక్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుతున్న అన్వీ అమిత్ జోషి(14).. ఇటీవల ఆఫ్రికాలోని ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. ఖతార్ నుండి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కులలో ఆమె ఒకరు. ఆమె 2021లో ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను కూడా చేరుకొని రికార్డు సృష్టించింది. "శిఖరాగ్రానికి చేరుకున్నప్పుడు చాలా సంతోషంగా అనిపించింది. చాలామందికి అసాధ్యమైన దీన్నినేను చిరునవ్వుతో.. ఆనందంతో అధిరోహించాను." అని అన్వీ తన ట్రెక్కింగ్ అనుభవాలను తెలిపింది. ఇప్పటి వరకు అన్వీ మూడు దేశాల్లో మొత్తం ఏడు ట్రెక్‌లను పూర్తి చేసింది. భారతదేశంలోని రూపిన్ పాస్, హేమకుండ్ సాహిబ్, కేదార్‌కాంతతో పాటు నేపాల్‌లోని మార్డి హిమాల్, అన్నపూర్ణ సర్క్యూట్/ థొరాంగ్ లా పాస్, ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌లను అధిరోహించింది. తన ఏడో ప్రయత్నంగా మౌంట్ కిలిమంజారోను జయించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com