స్పైస్జెట్ విమాన సంస్థకు డీజీసీఏ షాక్..
- July 27, 2022
న్యూ ఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగా స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. లోపాలపై సమీక్షించేందుకు డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు ఈ నెల 6న సైతం స్పైస్జెట్కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 19 నుంచి ఎనిమిది స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఫలితంగా విమానాలను దారి మళ్లించడం, అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.
సాంకేతిక సమస్యలు గుర్తింపు, తనిఖీలు, భద్రత మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఎనిమిది వారాల పాటు స్పైస్జెట్ కేవలం 50 శాతం విమానాలనే నడిపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డీసీజీఏ తీసుకున్న ఈ నిర్ణయం స్పైస్జెట్ కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







