స్పైస్జెట్ విమాన సంస్థకు డీజీసీఏ షాక్..
- July 27, 2022
న్యూ ఢిల్లీ: విమానయాన సంస్థ స్పైస్జెట్కు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఎనిమిది వారాల పాటు ఆమోదం పొందిన విమానాల్లో 50 శాతం విమానాలనే నడపాలని డీజీసీఏ ఆదేశించింది. గత కొద్ది రోజులుగా స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్న సంగతి తెలిసిందే. లోపాలపై సమీక్షించేందుకు డీజీసీఏ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇంతకుముందు ఈ నెల 6న సైతం స్పైస్జెట్కు డీజీసీఏ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. జూన్ 19 నుంచి ఎనిమిది స్పైస్జెట్ విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ఫలితంగా విమానాలను దారి మళ్లించడం, అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు డీజీసీఏ నిర్ణయం తీసుకుంది.
సాంకేతిక సమస్యలు గుర్తింపు, తనిఖీలు, భద్రత మొదలైన అంశాలను పరిగణనలోకి తీసుకొని.. ఎనిమిది వారాల పాటు స్పైస్జెట్ కేవలం 50 శాతం విమానాలనే నడిపించాలని ఆదేశాలు జారీ చేసినట్లు డీజీసీఏ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. డీసీజీఏ తీసుకున్న ఈ నిర్ణయం స్పైస్జెట్ కార్యకలాపాలపై ప్రభావం చూపనుంది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







