తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం
- July 31, 2022
హైదరాబాద్: తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది.ఆదివారం జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో షూటింగ్లు సోమవారం నుంచి ఆపేయాలని నిర్ణయం తీసుకున్నారు.ఈ నిర్ణయంతో కొత్తగా మొదలయ్యే సినిమాలే కాదు.ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలు కూడా నిలిచిపోనున్నాయి.
తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త ప్రెసిడెంట్ గా బసిరెడ్డిని ఎన్నుకున్నారు. మొత్తం 48 మంది ఈసీ మెంబర్స్కు ఓటు హక్కు ఉండగా 42 మంది ఈసీ సభ్యులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 22ఓట్లతో ప్రస్తుత అధ్యక్షుడు కొల్లి రామకృష్ణపై గెలుపు సాధించారు బసిరెడ్డి.
ఈ విజయాన్ని అధికారికంగా ప్రకటన ద్వారా తెలియజేసింది ఫిలిం ఛాంబర్. ఈ మేరకు ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో మాట్లాడిన తెలుగు ఫిలిం ఛాంబర్ నూతన ప్రెసిడెంట్ బసిరెడ్డి..“రేపటి నుంచి సినిమా షూటింగ్ లు బంద్ చెయ్యాలని అనుకున్నాం. సినిమా ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారు. 24 క్రాఫ్ట్స్లో అందరికీ ఇబ్బందులు ఉన్నాయి. అందరికీ న్యాయం చేయాలని చూస్తున్నాం. అందరం కలసి నిర్ణయం తీసుకున్నాం. అందరం
రేపటి నుంచి ఫెడరేషన్ సమస్యలపై చర్చలు జరుపుతాం. రేపటి నుంచి తెలుగు సినిమా షూటింగులు నిలిపివేయాలని నిర్ణయించాం. జనరల్ బాడి మీటింగ్లో ఈ నిర్ణయం తీసుకున్నాం. మరోసారి కూర్చొని చర్చలు జరుపుతాం. సమస్యలకి పరిష్కారం దొరికేంత వరుకు ఇదే నిర్ణయంపై ఉంటాం” అని అన్నారు.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







