హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
- July 31, 2022
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈనెల 25న ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీలు జోగినపల్లి సంతోష్కుమార్, జి.రంజిత్రెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, తెరాస ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్కుమార్రెడ్డి, కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్సింగ్ తదితరులు ఢిల్లీకి వెళ్లారు.
ముందుగా మూడు రోజుల పర్యటన అనుకున్నారు.కానీ పర్యటన 5 రోజులు సాగింది.ఢిల్లీ పర్యటనలో భాగంగా కేసీఆర్ పలు పార్టీల రాజకీయ నేతలతో సమావేశమయ్యారు. శుక్రవారం మధ్యాహ్నం సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కేసీఆర్ సమావేశమయ్యారు. కేంద్రంలోని మోడీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల నేతలతో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఐదో టీ20 సిరీస్.. విజేతగా భారత్
- స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ ను ప్రారంభించిన నారా భువనేశ్వరి
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం
- ఆ వృత్తిలోకి ఎవ్వరూ వెళ్లకండి.: పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
- ఖతార్లో సీజనల్ ఇన్ఫ్లుఎంజా టీకాలపై క్యాంపెయిన్..!!
- బీస్ట్ ల్యాండ్ జోన్ కోసం GEA టిక్కెట్లు ప్రారంభం..!!
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ లో యోగా స్పెషల్..!!
- బౌలేవార్డ్ క్రికెట్ గ్రౌండ్ లో "ఇండియా మేళా 2025"..!!
- శాశ్వత వైకల్యం..బాధితుడికి BD 7,000 పరిహారం..!!
- సోషల్ ప్రొటెక్షన్ ఫండ్ ఆన్ లైన్ సేవలకు అంతరాయం..!!







