హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

- July 31, 2022 , by Maagulf
హైదరాబాద్ కు చేరుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ కు చేరుకున్నారు. ఈనెల 25న ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్​ , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌, ఎంపీలు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, జి.రంజిత్‌రెడ్డి, ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, తెరాస ప్రధానకార్యదర్శి రావుల శ్రవణ్‌కుమార్‌రెడ్డి, కరీంనగర్‌ మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ తదితరులు ఢిల్లీకి వెళ్లారు.

ముందుగా మూడు రోజుల పర్యటన అనుకున్నారు.కానీ పర్యటన 5 రోజులు సాగింది.ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా కేసీఆర్ పలు పార్టీల రాజ‌కీయ నేతలతో స‌మావేశ‌మ‌య్యారు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం స‌మాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాద‌వ్ తో కేసీఆర్ స‌మావేశ‌మ‌య్యారు. కేంద్రంలోని మోడీ సర్కారు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ఇద్దరు నేతలు విస్తృతంగా చర్చించినట్టు తెలుస్తుంది. ఇతర రాష్ట్రాల నేతలతో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com