వినియోగదారుల పరిరక్షణకు CPA చర్యలు.. RO85,134 రికవరీ
- August 02, 2022
మస్కట్: 2022 మొదటి అర్ధభాగంలో వినియోగదారుల కోసం చర్యలు చేపట్టినట్లు సౌత్ బటినాలోని బార్కాలో ఉన్న కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CPA) తెలిపింది. ఇందులో భాగంగా RO85,134 మొత్తాన్ని తిరిగి రికవరీ చేసినట్లు ప్రకటించింది. వినియోగదారుల రక్షణ చట్టంలో నిర్దేశించబడిన నిబంధనలు ఉల్లంఘించిన సందర్భంలో వినియోగదారుల హక్కులను పరిరక్షించడానికి రికవరీ చేసినట్లు CPA పేర్కొంది. వినియోగదారులకు భరోసా, సంతృప్తినిచ్చే సురక్షితమైన మార్కెట్ను రూపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని సీపీఏ పిలుపునిచ్చింది. బార్కా కన్స్యూమర్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గరిష్టంగా కార్మిక రంగం నుంచి (RO25,685) రికవరీ కాగా.. అల్యూమినియం, బ్లాక్ స్మిత్స్, వడ్రంగి వర్క్షాప్లు (RO15,624), కాంట్రాక్టు, బిల్డింగ్ మెటీరియల్స్ సెక్టార్ (RO14,034), ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూటర్లు (RO11,900), ఎలక్ట్రికల్,ఎలక్ట్రానిక్ ఉపకరణాల రంగం (RO10,300) నుంచి రికవరీ చేశారు. అలాగే ఫర్నీచర్, ఫర్నిషింగ్ సెక్టార్ నుండి RO2,233, కళ్యాణ మండపాల నుండి RO1,910, ఆటో విడిభాగాల రంగం నుండి RO1,118, వాహనాల మరమ్మతు వర్క్షాప్ల నుండి RO1,175, క్లాతింగ్, టెక్స్ టైల్ నుండి RO1,085 రికవరీ చేసినట్లు సీపీఏ వెల్లడించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







