దుబాయ్ ఎయిర్పోర్ట్లో స్మార్ట్ గేట్లను వాడండి.. ప్రయాణికులను కోరిన యూఏఈ
- August 02, 2022
యూఏఈ: ఈ సంవత్సరం దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దాదాపు 6 మిలియన్ల మంది ప్రయాణికులు స్మార్ట్ గేట్ల గుండా వెళ్ళారని.. వేసవి రద్దీ సమయంలో ఆలస్యాన్ని నివారించడానికి ప్రయాణికులు స్మార్ట్ గేట్ల సర్వీస్ ను ఎంచుకోవాలని అధికారులు కోరారు. గేట్ల వద్ద ఏర్పాటు చేసిన అత్యాధునిక బయోమెట్రిక్ సిస్టమ్లు పాస్పోర్ట్ నియంత్రణ అధికారులపై ఒత్తిడిని తగ్గించాయని పేర్కొన్నారు. సగటున విమానాశ్రయంలో ఉన్న 122 స్మార్ట్ గేట్లను నెలకు సుమారు ఒక మిలియన్ మంది ప్రయాణికులు ఉపయోగించినట్లు వివరించారు. ఎయిర్పోర్ట్లో స్మార్ట్ గేట్లు, టన్నెల్ను ఉపయోగించే వారి సంఖ్య ఈ సంవత్సరం 50 శాతం పెరిగిందని GDRFA-దుబాయ్లోని ఎయిర్పోర్ట్ ఆపరేషన్స్ డిప్యూటీ డైరెక్టర్ అసిస్టెంట్ కల్నల్ ఫైసల్ అల్ నుయిమి అన్నారు. పాస్పోర్ట్ నియంత్రణ విధానాలను ఐదు సెకన్లలో పూర్తి చేయడానికి ప్రయాణికులను అనుమతించడానికి స్మార్ట్ టెక్నాలజీలో ఫేస్, ఐరిస్-రికగ్నిషన్ టెక్నాలజీని ఉపయోగించినట్లు తెలిపారు. విమానాశ్రయం నుండి బయలుదేరేటప్పుడు ఎక్కువ మంది ప్రజలు స్మార్ట్ టన్నెల్ను ఉపయోగిస్తున్నారని అల్ నుయిమి చెప్పారు. ఈ సంవత్సరం ప్రథమార్ధంలో దాదాపు 23,000 మంది ప్రజలు స్మార్ట్ టన్నెల్ను ఉపయోగించారన్నారు.
తాజా వార్తలు
- గ్లోబల్ పీస్ లీడర్..ఖతార్ పై UN చీఫ్ ప్రశంసలు..!!
- సౌదీలకు మరో ఏడాది పాటు వీసా మినహాయింపు..!!
- 3 రోజులు గడిచినా అందని లగేజీ.. ఎయిర్ ఇండియా తీరుపై ఫైర్..!!
- కువైట్ లో ఆన్లైన్ గ్యాబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఒమన్ సొంతూరులా.. సింగర్ మధుబంటి బాగ్చి ఎమోషనల్..!!
- బహ్రెయిన్ లో స్మార్ట్ ట్రాఫిక్ కెమెరాల ట్రయల్ రన్ సెట్..!!
- ఘనంగా NATS పిట్స్ బర్గ్ వార్షికోత్సం
- అంతరిక్షంలో ఏఐ డేటా కు గూగుల్ శ్రీకారం
- తెలుగు రాష్ట్రాలను అనుసరిస్తున్న న్యూయార్క్ కొత్త మేయర్..
- 'తానా ప్రపంచసాహిత్య వేదిక' ఆధ్వర్యంలో బాలల దినోత్సవం







