రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ కలిసి మరోసారి..

- April 13, 2016 , by Maagulf
రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ కలిసి మరోసారి..

రా మ్‌ కథానాయకుడిగా 'కందిరీగ' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్న దర్శకుడు సంతోష్‌ శ్రీనివాస్‌. ఆ ఇద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. 14 రీల్స్‌ పతాకంపై రూపొందుతున్న ఆ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎం.శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి క్లాప్‌నిచ్చారు. స్రవంతి రవికిషోర్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. హరీష్‌ శంకర్‌.ఎస్‌, హను రాఘవపూడి కలిసి దర్శకుడికి స్క్రిప్ట్‌ని అందజేశారు. ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న చిత్రమిది. 'కందిరీగ' తర్వాత రామ్‌, సంతోష్‌ శ్రీనివాస్‌ కలిసి చేస్తున్న ఈ సినిమా మే మూడో వారం నుంచి సెట్స్‌పైకి వెళుతుంది. దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చిత్ర నిర్మాతలు రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనిల్‌ సుంకర తెలిపారు. జిబ్రాన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళ: అవినాష్‌.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com