రామ్, సంతోష్ శ్రీనివాస్ కలిసి మరోసారి..
- April 13, 2016
రా మ్ కథానాయకుడిగా 'కందిరీగ' చిత్రాన్ని తెరకెక్కించి విజయాన్ని అందుకున్న దర్శకుడు సంతోష్ శ్రీనివాస్. ఆ ఇద్దరూ మరోసారి కలిసి సినిమా చేస్తున్నారు. 14 రీల్స్ పతాకంపై రూపొందుతున్న ఆ చిత్రం శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ఎం.శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్నిచ్చారు. స్రవంతి రవికిషోర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హరీష్ శంకర్.ఎస్, హను రాఘవపూడి కలిసి దర్శకుడికి స్క్రిప్ట్ని అందజేశారు. ''విజయవంతమైన కలయికలో రూపొందుతున్న చిత్రమిది. 'కందిరీగ' తర్వాత రామ్, సంతోష్ శ్రీనివాస్ కలిసి చేస్తున్న ఈ సినిమా మే మూడో వారం నుంచి సెట్స్పైకి వెళుతుంది. దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం'' అని చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర తెలిపారు. జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కళ: అవినాష్.
తాజా వార్తలు
- కార్మికుల భద్రతకు దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం
- సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయాణికులకు బంగారం పై కొత్త నిబంధనలు
- కువైట్లో అతిపెద్ద వలస కార్మిక వర్గంగా భారతీయులు..!!
- హోర్ముజ్ లో నౌకాయాన స్వేచ్ఛపై సౌదీతో ఒమన్ చర్చలు..!!
- మరో 8మంది భారతీయుల మృతదేహాలు స్వదేశానికి తరలింపు..!!
- యూఏఈ మీడియేషన్ విజయాన్ని స్వాగతించిన బహ్రెయిన్..!!
- వెనిజులాకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల తక్షణ సహాయం..!!
- ఏడాదిలో 25 మిలియన్ల పిల్స్, టన్నుకు పైగా డ్రగ్స్ సీజ్..!!
- బహ్రెయిన్ భూభాగంపై ఇరాన్ డ్రోన్ దాడులను ఖండించిన బహ్రెయిన్
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన ఖరారు







