మసాజ్ పార్లర్ల మాటున దోపిడీ.. ఐదుగురు సభ్యుల ముఠా అరెస్ట్
- August 05, 2022
యూఏఈ: మసాజ్ పార్లర్ల మాటున దోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యుల ముఠాను షార్జా పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాలో ఐదుగురు ఆసియన్లు ఉన్నారన్నారు. నిందితులు మసాజ్ లేదా స్పా థెరపీ సెషన్లను అందించే 'బిజినెస్ కార్డ్లను' పంపిణీ చేస్తారని, ఆ తర్వాత ఖాతాదారులను ఈ ముఠా కత్తులతో బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేసేవారని షార్జా పోలీస్లోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (సిఐడి) డైరెక్టర్ కల్నల్ ఒమర్ అబు జౌద్ తెలిపారు. రోల్లా ప్రాంతంలో కార్డులు పంపిణీ చేస్తున్న అనుమానితులలో ఒకరి గురించి అధికార యంత్రాంగానికి సమాచారం అందిందని ఆయన వివరించారు. ప్రత్యేక భద్రతా బృందాలు అనుమానితుడి నివాసాన్ని గుర్తించి దాడి చేసి ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుల నివాసం నుంచి విజిటింగ్ కార్డుల పెట్టెలు, అనేక సైజుల్లో ఉన్న ఆయుధాలను (కత్తులు) గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులందరూ నేరాన్ని అంగీకరించారని, తదుపరి విచారణ నిమిత్తం వారిని సంబంధిత అధికారులకు అప్పగించినట్లు ఒమర్ అబు జౌద్ పేర్కొన్నారు. అనుమానాస్పద ప్రకటనలు లేదా ప్రతికూల కార్యకలాపాలను వెంటనే అధికారులకు తెలియజేయాలని షార్జా పోలీసులు పిలుపునిచ్చారు.
తాజా వార్తలు
- జింబాబ్వే పై భారత్ ఘన విజయం
- భారత్-ఇజ్రాయెల్ మధ్య కీలక ఒప్పందాలు
- మళ్లీ తగ్గిన బంగారం ధర..పసిడి ప్రియులకు కాస్త ఊరట
- సౌదీ చమురుయేతర ఎగుమతుల్లో 18.6% వృద్ధి..!!
- సల్మాబాద్లోని గ్యారేజీని దోచుకున్న ఫేక్ పోలీసులు..!!
- బ్యాడ్మింటన్ గేమ్ ఆడుతూ..కేరళ వాసి మృతి..!!
- దక్షిణ అల్ బటినాలో ఫ్రాడ్ సస్పెక్ట్ అరెస్ట్..!!
- ఖతార్ లో 7 శాతం పెరిగిన FDI లు..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఎయిర్ ఫెయిర్స్ కు రెక్కలు..!!
- ఆన్లైన్ కంటెంట్కు డిజిటల్ ప్లాట్ఫామ్లు బాధ్యత వహించాలి: మంత్రి వైష్ణవ్









