తెలంగాణ కరోనా అప్డేట్
- August 05, 2022హైదరాబాద్: తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. రోజువారీ కేసుల్లో భారీ పెరుగుదల ఆందోళనకు గురి చేస్తోంది.
రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 40వేల 663 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 984 మందికి పాజిటివ్ గా తేలింది. అత్యధికంగా హైదరాబాద్ లో 365 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 61 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 57 కేసులు, నల్గొండ జిల్లాలో 41 కేసులు, కరీంనగర్ జిల్లాలో 37 కేసులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 22 కేసులు గుర్తించారు.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 923 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఊరటనిచ్చే మరో అంశం ఏంటంటే.. కొత్తగా కొవిడ్ మరణాలేవీ సంభవించలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 24వేల 708 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 14వేల 179 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 6వేల 418గా ఉంది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 43వేల 318 కరోనా పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 1061 మందికి పాజిటివ్ గా తేలింది.
తాజా వార్తలు
- తెలంగాణ: వడదెబ్బకు ఐదుగురు మృతి.. ఇవాళ, రేపు జాగ్రత్త
- తెలంగాణలో ప్రధాని మోదీ భారీ బహిరంగ సభ.. ఏర్పాట్లు పూర్తి
- పతంజలికి మరో షాక్.. 14 ఉత్పత్తులపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం బ్యాన్
- హైదరాబాద్లో గేమింగ్ ముఠా గుట్టు రట్టు.. 9 మంది అరెస్ట్, రూ.62 వేలు సీజ్
- బాలాకోట్ దాడుల విషయం పాక్ కే ముందు చెప్పాం..చాటుమాటు వ్యవహారాలు నేను చేయను: మోడీ
- కువైట్ ఆర్మీ జనరల్ స్టాఫ్ చీఫ్ని కలిసిన భారత రాయబారి
- Dh3 మిలియన్ల వరకు జరిమానా: CSI చర్చి, BAPS ఆలయాన్ని సందర్శిస్తున్నారా?
- SR808 బిలియన్లకు చేరిన FDI పెట్టుబడులు..!
- ఖతార్ ఎయిర్వేస్ మొట్టమొదటి AI క్యాబిన్ సిబ్బంది..!
- వెబ్సైట్లలో వ్యక్తిగత డేటా షేర్.. ROP హెచ్చరికలు