ఖతార్ లో 13,430 హెక్టార్లకు చేరుకున్న సాగు భూమి
- August 06, 2022ఖతార్: ఖతార్ సాగు భూమి 13,430 హెక్టార్లకు చేరుకుంది. 2021లో 772,829 టన్నుల పండ్లు, కూరగాయలు, ధాన్యాన్ని ఉత్పత్తి చేసింది. ఈ మేరకు మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖలోని వ్యవసాయ వ్యవహారాల విభాగం తన సోషల్ మీడియాలో తెలిపింది. 2,766 హెక్టార్లలో సాగు చేయబడిన కూరగాయల ఉత్పత్తి 2021 నాటికి 101,882 టన్నులకు చేరుకుందని పేర్కొంది. 2,703 హెక్టార్లలో 29,933 టన్నుల పండ్లను ఉత్పత్తి చేశారు. దీంతోపాటు 394 హెక్టార్లలో 3,305 టన్నుల ధాన్యాన్ని సాగు చేశారు. అలాగే 2021లో 7,566 హెక్టార్లలో 637,706 టన్నుల పశుగ్రాసాలను ఉత్పత్తి చేశారు. వ్యవసాయ యోగ్యమైన భూములు పెరుగుతున్నాయని, వ్యవసాయ ఉత్పత్తి ఖతార్ జాతీయ ఆహార భద్రతా వ్యూహం 2018-2023 విజయాన్ని తెలుపుతోందని వ్యవసాయ విభాగం పేర్కొంది. టేబుల్ గుడ్ల ఉత్పత్తిని 70 శాతానికి, చేపలను 90 శాతానికి, రొయ్యలను 100 శాతానికి, రెడ్ మీట్ ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ