వ్యాక్సినేషన్ కోసం కువైట్ లో 16 ప్రత్యేక కేంద్రాలు
- August 06, 2022కువైట్ : కోవిడ్-19 వ్యాధిని ఎదుర్కొనే ప్రయత్నంలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ సేవలను అందించడానికి ప్రత్యేకంగా 16 ఆరోగ్య కేంద్రాలను కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కేటాయించింది. ఈ కేంద్రాలు ఆగస్టు 10వ తేదీ నుంచి పనిచేయనున్నాయి. ఆదివారం నుండి గురువారం వరకు మధ్యాహ్నం 3 నుండి రాత్రి 8 గంటల వరకు ఈ కేంద్రాలు తెరచి ఉంటాయి. అబ్దుల్ రెహ్మాన్ అల్-జైద్ హెల్త్ సెంటర్ వెస్ట్ మిష్రెఫ్లో ఫైజర్ వ్యాక్సిన్ ను 5 నుండి 12 సంవత్సరాల పిల్లలకు (మొదటి, రెండవ డోసులు).. 12 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు (మూడవ బూస్టర్ డోస్, నాల్గవ బూస్టర్) టీకా సేవలను అందించడానికి కేటాయించారు. 50 అంతకంటే ఎక్కువ వయస్సు వారికి మిగిలిన 15 ఆరోగ్య కేంద్రాలు రిజర్వ్ చేయబడ్డాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.
తాజా వార్తలు
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు
- యాదాద్రి భక్తులకు డ్రెస్ కోడ్.. జూన్ 1 నుంచి అమల్లోకి..
- భారీగా పెరిగిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ దంపతుల ఆస్తులు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..