‘సీతారామం’ ప్రమోషన్లలో రష్మిక కనిపించలేదెందుకంటే.!
- August 06, 2022నేషనల్ క్రష్ అనే ఇమేజ్ దక్కించుకున్న రష్మికా మండన్నా ఆ క్రేజ్ని బాగా యూజ్ చేసుకుంటోంది. తెలుగు, తమిళ సినిమాల్లో నటిస్తూనే బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడిపేస్తోంది.
ముఖ్యంగా రష్మిక చేతిలో మూడు బాలీవుడ్ బిగ్ ప్రాజెక్టులున్నాయ్. మూడూ ప్రెస్టీజియస్ ప్రాజెక్టులే. కెరీర్ మొదట్లోనే ఇంత భారీ ప్రాజెక్టులు పట్టేయడం అన్నది అంత ఆషా మాషీ విషయం కాదు.
దీపమున్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి.. అనే నానుడికి రష్మిక బాగా వాడేసుకుంటోంది. కొందరు ముద్దుగుమ్మలు సౌత్ సినిమాలతో బిజీగా వున్నప్పుడు, బాలీవుడ్పై దృష్టి పెడితే, ఇక్కడ కెరీర్ నాశనమైపోతుంది అని భయపడుతుంటారు. కానీ, రష్మిక అలా కాదు, డేరింగ్ స్టెప్ వేసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనిపించుకుంటూనే, బాలీవుడ్లో ఫుల్ ఫోకస్ పెట్టేసింది. రణ్బీర్ కపూర్తో ‘యానిమల్’ అనే సినిమాలో నటిస్తోంది రష్మిక. అలాగే, బిగ్ బి అమితాబ్ బచ్చన్తో ‘గుడ్బై’ సినిమాని ఆల్రెడీ పూర్తి చేసేసింది. దీంతో పాటూ, ‘మిషన్ మజ్ను’ సినిమానీ పూర్తి చేసేసింది. సిద్దార్ధ్ మల్హోత్రా ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.
వీటితో పాటూ మరిన్ని బాలీవుడ్ ప్రాజెక్టులు పట్టేసే పనిలో రష్మిక బిజీగా వుందట. ఇలా బాలీవుడ్లో బిజీ షెడ్యూల్స్తో వున్న కారణంగానే ‘సీతారామం’ సినిమాని తన స్టయిల్లో ప్రమోట్ చేయలేకపోయానని అంటోంది రష్మిక మండన్నా. ఆగస్టు 5న రిలీజ్ అయిన ఈ సినిమా అయినా కానీ, మంచి విజయం అందుకుంది. రష్మిక పాత్రకు నెక్స్ట్ లెవల్ గుర్తింపు దక్కింది.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం