త్వరతగతిన పూర్తి అవుతున్న ఫుజైరా రైల్వే లైన్
- August 06, 2022యూఏఈ: ఇతిహాద్ రైలు యొక్క ఫుజైరా రైల్వే లైన్ నిర్మాణం పనులు త్వరతగతిన పూర్తి అవుతున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన చిత్రాలు బయటకు వచ్చాయి.
అబుధాబి, దుబాయ్ లను కలుపుతూ వేస్తున్న రైల్వే మార్గంలో ఈ రైల్వే లైన్ హజర్ పర్వతాలను కట్ చేస్తూ రాస్ అల్ ఖైమా కోస్తా తీరం దాకా విస్తరించడం జరిగింది.
ఇందుకు సంబంధించిన చిత్రాలను ఇతిహాద్ రైలు అధికారులు ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. షార్జా సరిహద్దు నుండి రాస్ అల్ ఖైమా కోస్తా తీరం వరకు సుమారు 145 కిలో మీటర్లు ఈ లైన్ నిర్మాణం విస్తరించి ఉంది.
రైలు ప్రయాణం చాలా సురక్షితమైనది మరియు అతి తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని కూడా పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఉన్న 11 నగరాలను రైల్వే ద్వారా అనుసంధానించడం జరుగుతుంది.
2030 నాటికి దేశవ్యాప్తంగా రైళ్ళ లో ప్రయాణించే వారి సంఖ్య 36.5 మిలియన్లు ఉంటుందని అంచనా.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ