ఖతార్ లో ‘బ్యాక్ టు స్కూల్’ క్యాంపెయిన్
- August 07, 2022
దోహా: ఆగస్టు 13న "విత్ ఎడ్యుకేషన్, వీ బిల్డ్ ఖతార్" అనే నినాదంతో "బ్యాక్ టు స్కూల్" ప్రచారాన్ని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఈ క్యాంపెయిన్ ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. దోహా ఫెస్టివల్ సిటీ మద్దతు, రవాణా సంస్థ "కర్వా" సహకారంతో.. 2022-2023 విద్యా సంవత్సరానికి అన్ని కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ సాగనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల కోసం విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో "బ్యాక్ టు స్కూల్" క్యాంపెయిన్ ఒకటని పేర్కొంది. విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేందుకు మానసికంగా సిద్ధం చేయడం ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.
తాజా వార్తలు
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!







