ఖతార్ లో ‘బ్యాక్ టు స్కూల్’ క్యాంపెయిన్

- August 07, 2022 , by Maagulf
ఖతార్ లో ‘బ్యాక్ టు స్కూల్’ క్యాంపెయిన్

దోహా: ఆగస్టు 13న "విత్ ఎడ్యుకేషన్, వీ బిల్డ్ ఖతార్" అనే నినాదంతో "బ్యాక్ టు స్కూల్" ప్రచారాన్ని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఈ క్యాంపెయిన్ ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. దోహా ఫెస్టివల్ సిటీ మద్దతు, రవాణా సంస్థ "కర్వా" సహకారంతో.. 2022-2023 విద్యా సంవత్సరానికి అన్ని కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ సాగనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల కోసం విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో "బ్యాక్ టు స్కూల్" క్యాంపెయిన్ ఒకటని పేర్కొంది. విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేందుకు మానసికంగా సిద్ధం చేయడం ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com