ఖతార్ లో ‘బ్యాక్ టు స్కూల్’ క్యాంపెయిన్
- August 07, 2022
దోహా: ఆగస్టు 13న "విత్ ఎడ్యుకేషన్, వీ బిల్డ్ ఖతార్" అనే నినాదంతో "బ్యాక్ టు స్కూల్" ప్రచారాన్ని విద్య, ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించనుంది. ఈ క్యాంపెయిన్ ఆగస్టు 20 వరకు కొనసాగుతుంది. దోహా ఫెస్టివల్ సిటీ మద్దతు, రవాణా సంస్థ "కర్వా" సహకారంతో.. 2022-2023 విద్యా సంవత్సరానికి అన్ని కిండర్ గార్టెన్, ప్రాథమిక పాఠశాల విద్యార్థుల లక్ష్యంగా ఈ క్యాంపెయిన్ సాగనుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, బంధువుల కోసం విద్యా మంత్రిత్వ శాఖ నిర్వహించే అత్యంత ముఖ్యమైన కార్యక్రమాలలో "బ్యాక్ టు స్కూల్" క్యాంపెయిన్ ఒకటని పేర్కొంది. విద్యార్థులు పాఠశాలకు తిరిగి వచ్చేందుకు మానసికంగా సిద్ధం చేయడం ఈ క్యాంపెయిన్ లక్ష్యంగా పెట్టుకుందని తెలిపింది.
తాజా వార్తలు
- ఎట్టకేలకు ఐపీఎల్ 2026 వేలం పై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
- శంకర ఐ కేర్ భవనాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
- ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డుల ప్రధానం చేయనున్న మంత్రి ఫరూక్
- డిసెంబర్ 12 నుండి 14 వరకు దుబాయ్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
- సైబర్ నేరాల పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!







