ఎయిర్పోర్ట్ ఏరియాలో నడుచుకుంటూ వెళ్లిన ప్రయాణికులు..
- August 07, 2022న్యూ ఢిల్లీ: ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ టామాక్ ఏరియాలో ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లిన ఘటనపై డీజీసీఏ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.శనివారం రాత్రి స్పైస్జెట్ విమానం హైదరాబాద్ నుంచి ఢిల్లీ చేరుకుంది. 11.24 గంటలకు విమానం ల్యాండ్ అయినప్పటికీ, ప్రయాణికుల్ని తీసుకెళ్లడానికి బస్సు రాలేదు.
విమానం నుంచి దిగిన ప్రయాణికులు, అక్కడ్నుంచి బస్సులోనే ఎయిర్పోర్ట్ టర్మినల్ చేరుకోవాల్సి ఉంటుంది. బస్సును ఎయిర్పోర్టుతోపాటు, విమానయాన సంస్థ కలిసి ఏర్పాటు చేయాలి. అలాగే భద్రతా కారణాల రీత్యా టామాక్ ఏరియాలో ప్రయాణికులు నడవడానికి అనుమతి లేదు. కానీ, విమానం ల్యాండ్ అయి 45 నిమిషాలు అయినప్పటికీ బస్సు చేరుకోలేదు. దీంతో విసిగిపోయిన కొందరు ప్రయాణికులు నేరుగా టామాక్ ఏరియా నుంచి నడుచుకుంటూ వెళ్లారు. కానీ, వారు ఎయిర్పోర్టు టర్మినల్ చేరుకునే లోపే బస్సు వచ్చింది. దీంతో విమానంలోని మిగతా ప్రయాణికులు, నడుచుకుంటూ వెళ్తున్న వాళ్లు అంతా కలిసి బస్సులోనే తిరిగి వెళ్లారు. కానీ, ఈ ఘటనపై డీజీసీఏ విచారణకు ఆదేశించింది.
ఇలా ప్రయాణికులు నడుచుకుంటూ వెళ్లడం నిషేధమని, దీనిపై జవాబు ఇవ్వాలని స్పైస్జెట్ సంస్థను ఆదేశించింది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. తాము బస్సుల కోసం ఎయిర్పోర్టు సిబ్బందికి చెప్పినప్పటికీ, అవి రావడం ఆలస్యమైందని, ఈ విషయాన్ని ప్రయాణికులకు చెప్పినప్పటికీ వారిలో కొందరు వినిపించుకోకుండా నడుచుకుంటూ వెళ్లారని ఆ సంస్థ చెప్పింది. అయితే, వారిని కూడా చివరకు బస్సులోనే తీసుకెళ్లామని వివరించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు