యూఏఈలో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించిన షార్జా ఛాంబర్
- August 08, 2022షార్జా: యూఏఈ తో భారత దేశం వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేుకునేందుకు పలు మార్గాలు ఉన్నాయి అని షార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (SCC) అభిప్రాయ పడింది.
ఛాంబర్ ఆఫ్ కామర్స్ పౌర సంబంధాల డైరెక్టర్ జనరల్ అబ్దుల్ అజీజ్ మొహమ్మద్ శట్టాఫ్ మాట్లాడుతూ భారత దేశం తో ఆర్థిక మరియు వాణిజ్య సంబంధాలు మరింత బలోపేతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూఏఈ లో భారతీయులు పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. వ్యాపార వాణిజ్య సంబంధాలు మరింత బలపడేందుకు భారత్ మరియు షార్జా ఛాంబర్ మధ్య కుదిరిన సమగ్రమైన ఏకానమిక్ భాగస్వామ్య ఒప్పందం (CEPA) దోహద పడుతుంది అని తెలిపారు.
ఈ సమావేశంలో షార్జా భారత వాణిజ్య ఛాంబర్ అధ్యక్షుడు ప్రదీప్ సురేఖ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ద్వారా వాణిజ్య మరియు ఆర్థిక కార్యకలాపాలు మరింతగా పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలకు యూఏఈ కీలకమైనది అని సైతం పేర్కొన్నారు.
తాజా వార్తలు
- 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ పై ముంబై విజయం
- ప్రపంచ రెండో ర్యాంకర్కు షాకిచ్చిన మనిక బాత్రా…
- TSRTC: పాస్ ఉంటే డీలక్స్ బస్సులోనూ ప్రయాణం…
- సింగపూర్ లో ప్రవాస భారతీయులతో పుస్తక ఆవిష్కరణ చేసిన డా.రామ్ మాధవ్
- SQU డే.. రాయల్ గ్రాంట్ గెలుచుకున్న ఏడు ప్రాజెక్టులు
- యూఏఈలో ఉల్లి ధరలు తగ్గుతాయా?
- విద్యార్థులకు శుభవార్త చెప్పిన CBSE
- ప్రయాణికుల మధ్య గొడవ.. విమానం ఆలస్యం
- సౌదీలో 9శాతం పెరిగిన నాన్-ఆయిల్ ఆదాయం
- ‘బహ్రెయిన్ బోర్స్’కు ఉత్తమ అరబ్ స్టాక్ ఎక్స్ఛేంజ్ అవార్డు