వెదర్ రిపోర్టును తప్పుగా పబ్లిస్ చేస్తే.. OMR50,000 జరిమానా: ఒమన్
- August 09, 2022
మస్కట్: ఒమన్ సుల్తానేట్ను ప్రభావితం చేసే వాతావరణ పరిస్థితులలో అనధికారిక అంచనాలు, హెచ్చరికలను ప్రచురించవద్దని పౌర విమానయాన అథారిటీ హెచ్చరించింది. తప్పుడు అంచనాలు రూపొందించి పౌర విమానయాన చట్టాన్ని ఉల్లంఘించిన వారికి OMR50,000 వరకు జరిమానా, జైలు శిక్ష విధించబడుతుందని పేర్కొంది. సివిల్ ఏవియేషన్ అథారిటీ వద్ద ఒమనీ వాతావరణ శాస్త్ర అథారిటీ జారీ చేసిన దానికి విరుద్ధంగా అంచనాలు హెచ్చరికలను ప్రచురించే అనేక మీడియా, వ్యక్తిగత ఖాతాలను పర్యవేక్షించినట్లు అథారిటీ తెలిపింది. ఆర్టికల్ (30) నిబంధనను ఉల్లంఘించే వ్యక్తికి ఒక సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష, OMR15,000 - OMR50,000 మధ్య జరిమానా లేదా ఈ రెండింటిలో ఏదైనా ఒకదాన్ని విధించే అవకాశం ఉందని హెచ్చరించింది.
తాజా వార్తలు
- ఖతార్ ఎమిర్కు యూఏఈ రాయబారి తన అధికార పత్రాలు సమర్పణ
- పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు పై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
- దుబాయ్లో లెమన్ స్టూడియో రెండో బ్రాంచ్ ఘనంగా ప్రారంభం
- షార్జాలో సివిల్ డిఫెన్స్ జరిమానాల పై 50 శాతం రాయితీ.. వ్యాపారాలకు ఊరట
- దుబాయ్లో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠా అరెస్ట్..
- APNRT కో-ఆర్డినేటర్ల నియామకం!
- ఏపీలో ఉద్యోగులకు బిగ్ గుడ్ న్యూస్..
- రాజధాని పై జగన్ సంచలన వ్యాఖ్యలు!!
- పోలీస్ స్టేషన్ల పునర్వ్యవస్థీకరణ పై డీజీపీ సివి.ఆనంద్ సమీక్ష
- ఏపీలోని రైల్వే కోడూరు నుంచి ‘వీబీ జీ రామ్ జీ’ జాతీయ పథకం ప్రారంభం







