బిజెపితో బంధానికి స్విస్తి పలికిన బీహార్ సీఎం
- August 09, 2022
పాట్నా: బిహార్ సిఎం, జేడీయూ నేత నీతీశ్ కుమార్ బిజెపితో బంధానికి స్విస్తి పలికారు. ఎన్డీయే కూటమితో పొత్తును రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఈరోజు జేడీయూ పార్టీ నేతల సమావేశంలో నిర్ణయంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. బీహార్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో సీఎంగా ఉన్న నితీశ్ కుమార్.. బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కొన్నాళ్ల నుంచి బిజెపితో సంబంధాలు సరిగా లేని కారణంగా.. ఆ కూటమికి నేడు గుడ్బై చెప్పేశారు నితీశ్. బీజేపీ(77)-జేడీయూ(45) కూటమి పాలన బీహార్లో ముగిసిపోయింది.
బిజెపితో తెగదెంపులు చేసుకున్నట్లు జేడీ నేత నితీశ్ తమ ఎమ్మెల్యేలకు చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం నితీశ్ కుమార్ ఆ రాష్ట్ర గవర్నర్ను కలవనున్నారు. అయితే ఆర్జేడీ, కాంగ్రెస్తో కలిసి నితీశ్ కుమార్.. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. నితీశ్ సీఎంగానే కొనసాగనున్నారు.
అయితే కొన్ని ఊహాగానాల ప్రకారం ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్కు హోంశాఖ ఇవ్వనున్నారు. నితీశ్కు ఆర్జేడీ, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు మద్దతు తెలిపినట్లు స్పష్టమవుతోంది.
తాజా వార్తలు
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..
- మణిపూర్లో అస్సాం రైఫిల్స్పై దుండగుల దాడి
- ఆర్చరీ ప్రీమియర్ లీగ్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించనున్న గ్లోబల్ ఐకాన్ రామ్ చరణ్
- నవరాత్రుల సందర్భంగా ప్రత్యేక టూర్ ప్యాకేజీ: APDTC
- ప్రపంచంలో మొదటిసారి 100 ఆవిష్కర్తలతో భేటీ కానున్న జర్నలిస్టులు
- సౌదీలో కొత్త పండ్లు, కూరగాయల ప్యాకేజింగ్ నిబంధనలు..!!
- వెబ్ సమ్మిట్ ఖతార్ 2026కి విస్తృత ఏర్పాట్లు..!!